30, డిసెంబర్ 2010, గురువారం

లక్ష్మణాచార్య కృత నామ రామాయణం - తాత్పర్యము

రామ నామమే జీవనము, రాముని గుణ కీర్తనయే ముక్తి. రామాయణ పారాయణయే జీవిత సోపానము. అట్టి రామ నామ సంకీర్తన ఎన్నో రూపాలలో జరిగింది. అందులో శ్రీ రామ జయ రామ జయ జయ రామ, శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే, శ్రీ రామ రామ రఘునందన రామ రామ ఇలా ఎన్నో మంత్రాలు, స్తోత్రాలు ప్రసిద్ధి చెందాయి. కోట్లాది భక్తులకు తారకమై ముక్తిని ప్రసాదించాయి. భక్తి, భజన, దాస సాంప్రదాయాలలో, హరికథలలో ఆ కోదండ రాముని నుతి పలు విధాలుగా జరిగింది, జరుగుతోంది. అటువంటి ఒక నామ గుణ కీర్తనే ఈ నామ రామాయణం. మొత్తం రామాయణాన్ని ప్రతి వాక్యంలో 'రామ' తారకం తో అంతమయ్యేలా రాసారు రచయిత  లక్ష్మణాచార్యులు. ఈయన గురించి వేరే వివరాలు అందుబాటులో కనిపించలేదు. కానీ, ఆయన చేసిన రచన మన అందరి మనస్సులో నిలిచిపోయింది. తేలిక పదాలతో పిల్లలు సైతము పాడుకునేలా రాసారు కవీంద్రులు. 108 నామములుగా మొత్తం రామాయణాన్ని వర్ణించి ధన్యులు అయినారు కవి వర్యులు.

దశాబ్దాల క్రితం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు దీన్ని దివ్యగానం చేశారు. ఆమె గళంలో ఇది ఒక అమృత ధారలా, రామ రస ప్రవాహంలా సుందరంగా, సుమధురంగా సాగుతుంది. రాగమాలికలో భక్తి ప్రపత్తులతో, నివేదనా భావనతో సాగుతుంది ఈ స్తుతి.

నామ రామాయణం, తాత్పర్యము, శ్రవణం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో.




బాల కాండ

శుద్ధబ్రహ్మపరాత్పర రామ
కాలాత్మకపరమేశ్వర రామ
శేషతల్పసుఖనిద్రిత రామ
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ
చండకిరణకులమండన రామ
శ్రీమద్దశరథనందన రామ
కౌసల్యాసుఖవర్ధన రామ
విశ్వామిత్రప్రియధన రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాదినిపాతక రామ
కౌశికమఖసంరక్షక రామ
శ్రీమదహల్యోద్ధారక రామ
గౌతమమునిసంపూజిత రామ
సురమునివరగణసంస్తుత రామ
నావికధావికమృదుపద రామ
మిథిలాపురజనమోహక రామ
విదేహమానసరంజక రామ
త్ర్యంబకకార్ముఖభంజక రామ
సీతార్పితవరమాలిక రామ
కృతవైవాహికకౌతుక రామ
భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యాపాలక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అయోధ్యాకాండ

అగణితగుణగణభూషిత రామ
అవనీతనయాకామిత రామ
రాకాచంద్రసమానన రామ
పితృవాక్యాశ్రితకానన రామ
ప్రియగుహవినివేదితపద రామ
తత్క్షాళితనిజమృదుపద రామ
భరద్వాజముఖానందక రామ
చిత్రకూటాద్రినికేతన రామ
దశరథసంతతచింతిత రామ
కైకేయీతనయార్పిత రామ
విరచితనిజపితృకర్మక రామ
భరతార్పితనిజపాదుక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అరణ్యకాండ

దండకావనజనపావన రామ
దుష్టవిరాధవినాశన రామ
శరభంగసుతీక్ష్ణార్చిత రామ
అగస్త్యానుగ్రహవర్ధిత రామ
గృధ్రాధిపసంసేవిత రామ
పంచవటీతటసుస్థిత రామ
శూర్పణఖార్తివిధాయక రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ రామ
మారీచార్తికృతాశుగ రామ
వినష్టసీతాన్వేషక రామ
గృధ్రాధిపగతిదాయక రామ
శబరీదత్తఫలాశన రామ
కబంధబాహుచ్ఛేదన రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

కిష్కింధాకాండ

హనుమత్సేవితనిజపద రామ
నతసుగ్రీవాభీష్టద రామ
గర్వితవాలిసంహారక రామ
వానరదూతప్రేషక రామ
హితకరలక్ష్మణసంయుత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

సుందరకాండ

కపివరసంతతసంస్మృత రామ
తద్గతివిఘ్నధ్వంసక రామ
సీతాప్రాణాధారక రామ
దుష్టదశాననదూషిత రామ
శిష్టహనూమద్భూషిత రామ
సీతావేదితకాకావన రామ
కృతచూడామణిదర్శన రామ
కపివరవచనాశ్వాసిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

యుద్ధకాండ

రావణనిధనప్రస్థిత రామ
వానరసైన్యసమావృత రామ
శోషితశరదీశార్తిత రామ
విభీష్ణాభయదాయక రామ
పర్వతసేతునిబంధక రామ
కుమ్భకర్ణశిరచ్ఛేదన రామ
రాక్షససంఘవిమర్ధక రామ
అహిమహిరావణచారణ రామ
సంహృతదశముఖరావణ రామ
విధిభవముఖసురసంస్తుత రామ
ఖఃస్థితదశరథవీక్షిత రామ
సీతాదర్శనమోదిత రామ
అభిషిక్తవిభీషణనుత రామ
పుష్పకయానారోహణ రామ
భరద్వాజాదినిషేవణ రామ
భరతప్రాణప్రియకర రామ
సాకేతపురీభూషణ రామ
సకలస్వీయసమానస రామ
రత్నలసత్పీఠాస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివకులసమ్మానిత రామ
విభీషణార్పితరంగక రామ
కీశకులానుగ్రహకర రామ
సకలజీవసంరక్షక రామ
సమస్తలోకోద్ధారక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

ఉత్తరకాండ

ఆగత మునిగణ సంస్తుత రామ
విశ్రుతదశకంఠోద్భవ రామ
సీతాలింగననిర్వృత రామ
నీతిసురక్షితజనపద రామ
విపినత్యాజితజనకజ రామ
కారితలవణాసురవధ రామ
స్వర్గతచంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవనందిత రామ
అశ్వమేధక్రతుదిక్షిత రామ
కాలావేదితసురపద రామ
ఆయోధ్యకజనముక్తిత రామ
విధిముఖవిభుదానందక రామ
తేజోమయనిజరూపక రామ
సంసృతిబంధవిమోచక రామ
ధర్మస్థాపనతత్పర రామ
భక్తిపరాయణముక్తిద రామ
సర్వచరాచరపాలక రామ
సర్వభవామయవారక రామ
వైకుంఠాలయసంస్థిత రామ
నిత్యానందపదస్థిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ


తాత్పర్యము:

బాల కాండ:

శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు  ,  కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అయోధ్య కాండ:

ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అరణ్యకాండ:

ఓ శ్రీరామా! నీవు దండకారణ్యంలోని జనులను పావనము చేసిన వాడవు, దుష్టుడైన విరాధుని చంపిన వాడవు, శరభంగుడు, సుతీక్ష్ణులచే పూజించ బడినవాడవు, అగస్త్యుని అనుగ్రహముతో వర్ధిల్లిన వాడవు, జటాయువుచే సేవించ బడినవాడవు, పంచవటీ తీరమున నివసించిన వాడవు, శూర్ఫణకకు దుఃఖము కలిగించిన వాడవు, ఖరఆ దూషణులను సంహరించిన వాడవు, సీత కోరిన మాయలేడిని అనుసరించిన వాడవు, మారీచుని సంహరించిన వాడవు, సీతను వెదకుతూ వెళ్ళిన వాడవు, జటాయువుకు మోక్షము కలిగించిన వాడవు, శబరి ఇచ్చిన ఫలములు తిన్న వాడవు, కబంధుని బాహువులు నరికిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

కిష్కింధకాండ:

ఓ శ్రీరామ! నీవు - హనుమంతునిచే పాదసేవ పొందిన వాడవు, సుగ్రీవుని కోరిక తీర్చిన వాడవు, గర్వి అయిన వాలిన సంహరించిన వాడవు, వానరులను దూతగా పంపిన వాడవు, హితుడైన లక్ష్మణునితో కూడి యున్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

సుందరకాండ:

ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు,  లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు,
సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

యుద్ధ కాండ: 

ఓ శ్రీరామా!  నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి.  నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు,  ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

ఉత్తరకాండము:

ఓ రామా!  నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు  మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము




పదునారవ దశకము - నరనారాయణుల అవతారము

దక్షో విరించతనయోఽథ మనోస్తనూజాం
లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాప కన్యాః |
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే || ౧౬-౧||

దక్షుడు మనువుయొక్క పుత్రిక యగు ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుగురు పుత్రికలు కలిగారు. వారిలో పదమూడు మందిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. పితృ దేవతలకు స్వధా అను కూతురును, అగ్నిదేవునకు స్వాహా అను కూతురును ఇచ్చెను. ఇట్లే,  విష్ణువు (నీ) అంశతో జన్మించిన శివునకు సతీదేవిని ఇచ్చి వివాహము చేసెను.

మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం
నారాయణం నరసఖం మహితానుభావమ్ |
యజ్జన్మని ప్రముదితాః కృతతుర్యఘోషాః
పుష్పోత్కరాన్ప్రవవృషుర్నునువుః సురౌఘాః || ౧౬-౨||

దక్షప్రజాపతి పుత్రిక, దరమును భార్యయైన "మూర్తి"కి నీవు నారాయణుడు అనే పేరుతో గొప్ప మహిమలు కలవానిగా జన్మించినావు. అట్లే, నీ అంశతో నరుడు అనువాడు జన్మించగా నీరు అన్యోన్య స్నేహముతో పెరిగితిరి. ప్రభూ! నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టలేక దుందుభి మొదలైన మంగళ వాద్యములను మ్రోగించుచు పుష్పవ్రుష్టిని కురిపించి, నిన్ను స్తుతించిరి.

దైత్యం సహస్రకవచం కవచైః పరీతం
సాహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః |
పర్యాయనీర్మితతపస్సమరౌ భవంతౌ
శిష్టైకకంకటమముం న్యహతాం సలీలమ్ || ౧౬-౩||

ఆ కాలమున సహస్ర కవచుడను రాక్షసుడు ఉండెను. అతనికి వేయి కవచములుండెను. అవి ఒక్కొక్కటి వేయి సంవత్సరములు తపస్సు చేసి, వేయి సంవత్సరములు యుద్ధము చేసినందు వలననే ఛేదించుటకు వీలయ్యేవి. మంచి వారిని బాధించుచున్న ఆ రాక్షసుని నర నారాయణులు మీరు ఒకరి తరువాత ఒకరు వేయి సంవత్సరములు తపస్సు, వేయి సంవత్సరములు యుద్ధము చేయుచు అతని కవచములను ఛేదించిరి. అటు పిమ్మట అతని వధించితిరి.

అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం
త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః |
శక్రోఽథ తే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనాపరివృతం ప్రజిఘాయ మారమ్ || ౧౬-౪||

స్వామీ! నరనారాయణ అవతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్ష ధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా పాటించుచు అక్కడ ఉన్న మహర్షులకు దానిని ఉపదేశించుచుంటిరి. అప్పుడు మీ శమము, తపోబలము చూచి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించ వలెనని అతడు దివ్యాంగనలతో మన్మథుని పంపెను.

కామో వసంతమలయానిలబంధుశాలీ
కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః |
విధ్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం
భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా || ౧౬-౫||

అప్పుడు వసంతుడు, మలయానిలము వంటి స్నేహితులతో కలసి మన్మథుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కతాక్షములచే మీ తపస్సును భంగ పరచుటకు ప్రయత్నించెను. అయినా, మీరు స్థిరముగా ఉండుట చూచి మన్మథునకు భయము వేసినది. అప్పుడు మీరు చిరునవ్వుతో ఇట్లు పలికితిరి.

భీత్యాలమంగజవసంతసురాంగనా వో
మన్మానసంత్విహ జుషుధ్వమితి బ్రువాణః |
త్వం విస్మయేన పరితః స్తువతామథైషాం
ప్రాదర్శయః స్వపరిచారకకాతరాక్షీః || ౧౬-౬||

"మన్మథా! వసంతుడా! అప్సరసలారా! మీరు భయ పడవద్దు. నేనిచ్చే అతిథి సత్కారములు స్వీకరించండి" అని అనగా వారు ఆశ్చర్యముతో స్తుతించుచుండిరి. అట్టి మన్మథుడు మొదలైన వారికి మిమ్ము సేవిన్చుచున్న పరిచారికలను మీరు చూపించితిరి.

సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే
త్వద్దాసికాపరిమళైః కిల మోహమాపుః |
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వ-
స్వర్వాసిగర్వశమనీం పునరుర్వశీం తామ్ || ౧౬-౭||

మన్మథుడు మొదలైన వారు నీ దాసీ జనము యొక్క సౌందర్యమును చూసి మోహ పరవశులైరి. స్వర్గములో అందరి సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఒసగగా మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని చూసి సిగ్గుపడి ఆమెను స్వీకరించిరి.

దృష్ట్వోర్వశీం త్వం కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులోఽజని భవన్మహిమావమర్శాత్ |
ఏవం ప్రశాంతరమణీయతరాఽవతారత్
త్వత్తోఽధికో వరద కృష్ణతనుస్త్వమేవ || ౧౬-౮||

మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి, మీ మహిమను తెలుపగా, తాను చేసిన తప్పుకు అతడు చాలా విచారించెను. వరములనిచ్చు స్వామీ! సౌమ్యము, సుందరమైన ఈ నర నారాయణ అవతారము కంటే మిగుల కృష్ణ స్వరూపము నీదే.

దక్షస్తు ధాతురతిలాలనయా రజోఽంధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్ |
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞో చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్ || ౧౬-౯||

బ్రహ్మ తన పుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందు వలన అతడు గర్వాంధుడయ్యెను. అందువలన అతడు బ్రహ్మ దేవుని మరియు మిమ్ములను గౌరవించకుండెను. దక్షుడు మీ అంశారూపియైన శంకరుని ద్వేషించ సాగెను. అతనితో గల వైరముతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమాన పరచెను.

కృద్ధేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః |
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ || ౧౬-౧౦||

అందువలన శంకరుడు కోపించి దక్షుని యాగమును ధ్వంసించెను. అతని శిరస్సును కూడా ఖండించెను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడు బ్రతికెను. ఆ యజ్ఞము సంపూర్ణము అయినందు వలన దక్షుడు శాంతించెను.  ఇట్లు శాంతిని కలిగించు గురువాయురప్పా! నీవే నన్ను రక్షించవలెను.

పదునేడవ దశకము - ధృవ చరితము

ఉత్తానపాదనృపతేర్మనునందనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా |
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిః శరణం గతాఽభూత్ || ౧౭-౧||

మనువునకు ఉత్తానపాదుడనే పుత్రుడు ఉండెను. అతనికి సునీతి, సురుచియను భార్యలు. వారిలో చిన్న భార్య యైన సురుచిపై మహారాజుకు అమితమైన ప్రేమ. పెద్ద భార్యను అతడు నిరాదరించ సాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధించసాగినది.

అంకే పితుః సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతోఽధిరోక్ష్యన్ |
ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా || ౧౭-౨||

ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రియైన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుని ఆడుకొనుచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చొన బోయెను. దానిని చూచి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామీ! నీపై భక్తిలేని వారికి అసూయ ఉండుట సహజము కదా!.

త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే
దూరం దురుక్తినిహతః స గతో నిజాంబామ్ |
సాఽపి స్వకర్మగతిసంతరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస || ౧౭-౩||

ప్రభూ! తండ్రియైన ఉత్తానపాదుడు నీ మాయవల్ల మోహమున పడి చిన్న భార్యయైన సురుచికి ఆధీనుడుగా ఉండెను. అట్టి తన తండ్రి చూస్తుండగానే పినతల్లియైన సురుచి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన  ధ్రువుని మనస్సు బాధపడినది. అందువలన అతడు బాధపడుచు తన తల్లి దగ్గరకు పోయెను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు కారణమైన నీ పాదములనే శరణు పొందుమని అతనికి  బోధించినది.

ఆకర్ణ్య సోఽపి భవదర్చనిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్కిల పంచవర్షః |
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే || ౧౭-౪||

ఆ బాలుడు తల్లిమాటలు విని నీ పాదారవిందములను సేవించవలెను అని నిశ్చయించుకొనెను. ఐదు సంవత్సరముల వయసు గల ఆ బాలుడు పట్టణము వదిలి పెట్టి పోవుచున్నంత నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును, ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సుతో నిన్ను ఆరాధించ సాగెను.

తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ |
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచ మాసాన్ || ౧౭-౫||

ధ్రువుడు దూరమగుట వలన ఉత్తానపాదుడు చాలా వ్యథ చెందెను. అప్పుడు నారదుడు వచ్చి ధ్రువునకు కలుగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరచెను. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనస్సు నిలిపి తపస్సును క్రమక్రమముగా పెంచి ఐదు మాసములు గడిపెను.

తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ద్రచేతాః |
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తా-
దావిర్బభూవిథ విభో గరుడాధిరూఢః || ౧౭-౬||

ధ్రువుని తపస్సుకు లోకములు తల్లడిల్లి పోయెను. అప్పుడు దేవతలందరూ నిను ప్రార్థించగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమను చిదానంద రసమున నిమగ్నుడై యున్న ధ్రువునకు దర్శనమొసగితివి.

త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే |
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథాఽఽదరేణ || ౧౭-౭||

ధ్రువునకు నీ దివ్యరూప దర్శనము కలుగగానే అతని మనస్సు ఆనందములో మునిగిపోయింది. కన్నులు సంతోష బాష్పములతో నిండి పోయినవి. ఆ విధముగా యున్న ధ్రువుడు నిన్ను స్తుతిన్చదలచినను అతనికి తగిన శక్తిలేనందు వలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్ప్రుశించితివి.

తావద్విబోధవిమలం ప్రణువంతమేన-
మాభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్ |
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువ పదం వినివృత్తిహీనమ్ || ౧౭-౮||

ప్రభూ! నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరిగి అతనితో 'ధృవా! నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై అత్యున్నతమైన ధ్రువ స్థానమున ఉందువు" అని పలికితివి.

ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోఽసౌ-
ఆనందితాఖిలజనో నగరీముపేతః |
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః || ౧౭-౯||

స్వామీ! ఈ విధముగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి. ఈ విషయము తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందించసాగిరి.ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంత కాలమునకు అతని తండ్రియైన ఉత్తానపాదుడు అడవికి పోయెను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన కోరికలు తీరి చాలా కాలము రాజ్యమేలెను.

యక్షేణ దేవ నిహతే పునరుత్తమేఽస్మిన్
యక్షైః స యుద్ధనిరతో విరతో మనూక్త్యా |
శాంత్యా ప్రసన్నహృదయాద్ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా || ౧౭-౧౦||

పరమేశ్వరా! ఉత్తముని ఒక యక్షుడు చంపినందు వలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని మనువు వచ్చి చెప్పినందు వలన అతడు యక్షులతో యుద్దమును మానివేసెను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావలెనని ధ్రువుడు వరమును కోరెను.

అంతే భవత్పురుషనీతవిమానయాతో
మాత్రా సమం ధ్రువపదే ముదితోఽయమాస్తే |
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం
వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్ || ౧౭-౧౧||

ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీయొక్క సేవకులు అతనిని ద్రువపదమునకు తీసికొని పోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడా ధ్రువుడు తల్లితో కలిసి ద్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయుపుర పతీ! నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము.

పదునెనిమిదవ దశకము - పృథు చరితము

జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తే-
రంగస్య వ్యజని సుతః స వేననామా |
తద్దోషవ్యథితమతిః స రాజవర్య-
స్త్వత్పాదే విహితమనా వనం గతోఽభూత్ || ౧౮-౧||

ధ్రువుని వంశమున అంగుడను మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్య పరిపాలనము చేసినందు వలన గొప్పకీర్తి పొందెను. ఆయనకు వేనుడను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహించలేక బాధపడుచు అంగ మహారాజు నిన్ను ధ్యానించుటకై  అడవికి పోయెను.

పాపోఽపి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్యైరుపనిహితః కఠోరవీర్యః |
సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్
భూచక్రే తవ యజనాన్యయం న్యరౌత్సీత్ || ౧౮-౨||

వేనుడు మిక్కిలి దుర్మార్గుడు. అయినా, అతడు మిక్కిలి బలము కలవాడు అని పుర ప్రముఖులు అతనిని రాజ్యపాలనము చేయుటకు సమ్మతించి రాజ సింహాసనము కట్టబెట్టిరి. అందువలన వేనుడు ఎల్లప్పుడూ తన బలమును పొగడుకొనుచు భూమండలమున ఎవ్వరుకూడా యజ్ఞ యాగాదులు చేయరాదని శాసించెను.

సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే
మత్తోఽన్యో భువనపతిర్న కశ్చనేతి |
త్వన్నిందావచనపరో మునీశ్వరైస్తైః
శాపాగ్నౌ శలభదశామనాయి వేనః || ౧౮-౩||

అతనికి హితవు చెప్పుటకు మహర్షులు కలసి వచ్చిరి. కానీ, మూర్ఖుడైన రాజు 'నన్ను మించిన లోకాధిపతి ఎవరున్నారు' అని జగన్నాథుడవైన నిన్ను నిందింప సాగెను. నీ నిందను సహించ లేని మునీశ్వరులు కోపముతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేనుడు శలభము వలె దగ్ధ మయ్యెను.

తన్నాశాత్ఖలజనభీరుకైర్మునీంద్రై-
స్తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే |
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః || ౧౮-౪||

వేనుడి మరణము వలన రాజు లేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు భీతిల్లితిరి. వేనుని మృత శరీరమును ఆతని తల్లి ప్రేమాతిశయముతో రక్షంచ సాగెను. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మథించగా అతని పాపము అంతా నశించెను. పిమ్మట అతని బాహువ్ను మథించగా దాని నుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి.

విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుతభావిభూరివీర్యః |
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం-
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః || ౧౮-౫||

పృథు మహారాజు అను పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలన చేయసాగిటివి. అందువలన ప్రజలు, వండి మాగధులు నిన్ను ఘనముగా కీర్తిన్చిరి. వేనుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకొనిన భూమిని నీవు ధనుస్సు ధరించి శాసించి సుసంపన్నము చేసితివి.

భూయస్తాం నిజకులముఖ్యవత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు |
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభితనూమదూదుహస్త్వమ్ || ౧౮-౬||

అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలు చేయగా, సముచితమైన పాత్రల యందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవునుండి పితికితివి.

ఆత్మానం యహతి మఖైస్త్వయి త్రిధామ-
న్నారబ్ధే శతతమవాజిమేధయాగే |
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వాఽశ్వం తవ తనయాత్ పరాజితోఽభూత్ || ౧౮-౭||

త్రివిక్రముడగు శ్రీ మహావిష్ణో! పృథువు రూపమున నీవు యజ్ఞములు చేయుచు నీ స్వరూపమునే ఆరాధించుచుంటివి. ఈ విధముగా ఆశ్వమేధములు నూరు చేయ తలపెట్టితివి.నీవు నూరవ అశ్వమేధము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచ వేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను. అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసికొని వచ్చెను.

దేవేంద్రం ముహురితి వాజినం హరంతం
వహ్నౌ తం మునవరమండలే జుహూషౌ |
రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ
సాక్షాత్త్వం మధురిపుమైక్షథాః స్వయం స్వమ్ || ౧౮-౮||

పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వమును తీసికొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకై ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమున రుత్విక్కులుగా ఉన్న భ్రుగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి చేయుటకు ప్రయత్నించిరి. ఆ సమయములో బ్రహ్మ దేవుడు స్వయముగా వచ్చి రుత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించెను. మధుసూదనా! అంతట ఆ మహారాజునకు నీవు దర్శన మొసగితివి.

తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం
గంగాంతే విహితపదః కదాపి దేవ |
సత్రస్థం మునినివహం హితాని శంస-
న్నైక్షిష్ఠాః సనకముఖాన్ మునీన్ పురస్తాత్ || ౧౮-౯||

స్వామీ! పృథు మహారాజు నేఎ ద్వారా అనన్య భక్తియను వరమును మాత్రము తీసికొని గంగాతీరమున నివసించు చుండెను. ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గోనుచున్న మునులకు నీవు ప్రవ్రుత్తి నివృత్తి రూపములైన హిత వచనములను ఉపదేశించితివి. అచట సనకాది మునులను చూచితివి.

విజ్ఞానం సనకముఖోదితం దధానః
స్వాత్మానం స్వయమగమో వనాంతసేవీ |
తత్తాదృక్పృథువపురీశ సత్వరం మే
రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్ || ౧౮-౧౦||

దేవా! పృథు మహారాజు రూపముననున్న నీవు సనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్లి తపస్సులో నిమగ్నుడవు అయితివి. తరువాత నీ స్వస్వరూపమును పొందితివి. అట్టి పవన పురాధీశా!  నా రోగములను దయతో రూపుమాపుము.

పందొమ్మిదవ శతకము - ప్రాచేతసుల కథ

పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః ప్రాచీనబర్హిర్యువతౌ శతదృతౌ |
ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్త్వత్కరుణాంకురానివ || ౧౯-౧

ప్రభూ! పృథు మహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞ యాగాదులు నిర్వహించెను. అతని భార్య శతద్రుతి. ఆ దంపతులకు 'ప్రచేతసులు' అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే.

పితుః సిసృక్షానిరతస్య శాసనాద్భవత్తపస్యాభిరతా దశాపి తే |
పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరమ్ || ౧౯-౨

స్వామీ! ఆ పదిమంది ప్రచేతసులును నిన్ను గూర్చి తపస్సు చేయుట యందే నిరతులు. ఐనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రియోక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను.


తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః |
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవస్తవమ్ || ౧౯-౩

ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి ఉత్తముడైన శంకరుడు నీ భక్తులగు ప్రచేతసులను దర్శించుకొనవలెనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చెను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించెను.

స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసేవిషతాయుతం సమాః |
భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్బభూవ కలో ధ్రువవన్న శీఘ్రతా || ౧౯-౪

ఆ ప్రాచేతసులందరూ శివుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే అనేక వేల సంవత్సరములు జపించుచు నిన్ను ధ్యానింప సాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనము నందు మునిగి యుండిరి. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏ మాత్రమూ తొందర పడలేదు.

తపోభిరేషామతిమాత్రవర్ధిభిః స యజ్ఞహింసానిరతోఽపి పావితః |
పితాఽపి తేషాం గృహయాతనారదప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ || ౧౯-౫

ప్రచేతసుల తండ్రియైన ప్రాచీనబర్హి అనేక యాగాములను చేసి ఆ యాగాములందు పశుహింస చేసినప్పతికిని తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యెను. ఆ ప్రాచీనబర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మ జ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుజ్యమను ముక్తిని పొందెను.

కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాః పతగేంద్రవాహనః |
విరాజి చక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదంచితద్యుతిః || ౧౯-౬

స్వామీ! నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపమిట్లున్నది. నీవు పక్షీన్ద్రుడైన గరుడుని అధిరోహించి యున్నావు. శంఖము, చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములు ఎనిమిది భుజములందు ధరించితివి.

ప్రచేతసాం తావదయాచతామపిః త్వమేవ కారుణ్యభరాద్వారానదాః |
భవద్విచింతాఽపి శివాయదేహినాం భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా || ౧౯-౭

ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములు కొరకున్నను కరుణతో నీవే వారికి వరములనిచ్చితివి. స్వామీ! నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును.

అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీమ్ |
సుతోఽస్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం ప్రయాస్యథేతి న్యగదో ముదైవ తాన్ || ౧౯-౮

"ప్రచేతసులారా! మీకు వృక్ష పుత్రికయైన 'మారిష' భార్య కాగలదు. ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండ గలరు. మీకు దక్షుడను పుత్రుడు కలుగును. పుత్రజనమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమును చేరుకుంటారు" -  అని సంతోషముతో వరములను ఇచ్చితివి.

తతశ్చ తే భూతలరోధినస్తరూన్కృధా దహంతో ద్రుహిణేన వారితాః |
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం త్వదుక్తకాలం సుఖినోఽభిరేమిరే || ౧౯-౯

ప్రచేతసులు నీ వలన దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లు దట్టముగా పెరిగి మానవులు జంతువులూ తిరుగుటకు వీలులేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగుల బెట్ట సాగిరి. అప్పుడు బ్రహ్మ దేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచిన మారిష అనే కన్యను ఇచ్చి వివాహము చేయగా వారు చాలా కాలము సుఖముగా నుండిరి.


అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయాధియా |
అవాపురానందపదం తథావిధస్త్వమీశ వాతాలయనాథ పాహిమామ్ || ౧౯-౧౦

వారికి దక్షుడను పుత్రుడు జన్మించెను. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదము పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ భక్తుడనైన నన్ను రక్షింపుము. 

27, డిసెంబర్ 2010, సోమవారం

రాఘవాష్టకం - తాత్పర్యము

తండ్రి మాటకై పదునాలుగేండ్లు వనవాసము చేసి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన మానవ అవతారమూర్తి శ్రీ రామ చంద్రుడు. ఏక పత్నీ వ్రతుడు, ధర్మ పరిపాలనా దక్షుడు, సోదర భావన మూర్తీభవించిన మంగళాకారుడు ఆ రామచంద్రుడు. ఈ రాఘవాష్టకం ఆ శ్రీరాముని గుణ కీర్తనలో ఒక మంచి భావ వ్యక్తీ కరణ. రచించిన కవి (ఎవరో తెలీదు) మంచి రసానుభూతి పొంది చేసిన కృతి.

రాఘవాష్టకం, తాత్పర్యము, శ్రవణం

(రచనలలో ఉపమానములు, అలంకారములు, విశేషణములు వాడేటప్పుడు మగవారిని సింహము, ఏనుగులతో పోల్చటం పరిపాటి. ఈ రెండు జంతువులూ ఉన్నతమైన లక్షణాలు కలిగి నేత్రుత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచాయి కాబట్టే ఇలా పోలిక. వెనుదిరుగని ధైర్యము, శౌర్యము సింహానిది అయితే, నాయకత్వము, నిలకడ, ప్రశాంతత, అవసరమైనప్పుడు భీకర పరాక్రమము ఏనుగు లక్షణాలు. సింహము ఒక్క ఏనుగుకు తప్ప దేనికి నిలువదు. అందుకే ఈ స్తోత్రములో కవి రఘు కుంజరం అని రాముని ఏనుగుతో ఉపమానము చేసినట్టున్నాడు).


రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం
జానకీవదనారవిందదివాకరం గుణభాజనం
వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం  ౧

మైథిలీకుచభూషణామలనీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం
నాగరీవనితాననాంబుజబోధనీయకలేవరం
సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౨

హేమకుండలమండితామలకంఠదేశమరిందమం
శాతకుంభమయూరనేత్రవిభూషణేనవిభూషితం
చారునూపురహారకౌస్తుభకర్ణభూషణభూషితం
భానువంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౩

దండకాఖ్యవనే రతామరసిద్ధయోగిగణాశ్రయం
శిష్టపాలనతత్పరం ధృతిశాలిపార్థకృతస్తుతిం
కుంభకర్ణభుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం  ౪

కేతకీకరవీరజాతిసుగంధిమాల్యసుశోభితం
శ్రీధరం మిథిలాత్మజాకుచకుంకుమారుణవక్షసం
దేవదేవమశేషభూతమనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం  ౫

యాగదానసమాధిహోమజపాదికర్మకరైర్ద్విజైః
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం
తాటకావధహేతుమంగతతాతవాలినిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం  ౬

లీలయా ఖరదూషణాదినిశాచరాశువినాశనం
రావణాన్తకమచ్యుతం హరియూథకోటిగణాశ్రయం
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్యవివక్షణం ప్రణమామి రాఘవకుంజరం  ౭

కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం
చారుహాసమనాథబంధుమశేషలోకనివాసినం
వాసవాదిసురారిరావణశాసనం చ పరాంగతిం
నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం  ౮

రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయసాధకం
ముక్తిభుక్తిఫలప్రదం ధనధాన్యసిద్ధివివర్ధనం
రామచంద్రకృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
రామచంద్రపదాంబుజద్వయసంతతార్పితమానసః  ౯

రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే  ౧౦

ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము: 

రఘువంశములో ఉత్తముడు, కరుణాకరుడు, మునులచే,సురులచే  పూజించ బడిన వాడు,  సీత యొక్క కలువ ముఖమునకు సూర్యుని వంటి వాడు, ఎన్నో సుగుణములకు నిలయము, అంగదునికి హితుడు, హనుమంతునికి ప్రియుడు, కమలముల వంటి కన్నులు కలవాడు, రాక్షసుల పాలిట సింహ స్వప్నమైన, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

సీతాదేవి కుఛములపై శాశ్వతమైన నీలపు ముత్యము వంటి ఈశ్వరుడు, విభీషణునికి రక్షకుడు, రఘువంశములో ఉత్తమ పురుషుడు, నా ఇష్టదైవము, అందమైన కలువ వంటి ముఖము కల నాగరిక స్త్రీ సౌందర్యాన్ని తలదన్నే రూపము కలవాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

మెడకిరు వైపులా బంగారపు కర్ణ కుండలములచే అలంకరించ బడిన వాడు, బంగారు నెమలి కన్నుల ఆభరణము ధరించిన వాడు, అందమైన నూపురములు, మెడలో కౌస్తుభ హారము, అందమైన చెవి ఆభరణములు కలిగిన వాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

దండకారణ్యములో అమరులైన సిద్ధులకు, యోగులకు ఆశ్రయము ఇచ్చిన వాడు, ధర్మ రక్షణే ఆశయముగా కలవాడు, పార్థునిచే పొగడబడిన వాడు, కుంభకర్ణుని సర్పముల వంటి చేతులను చేదించిన వాడు, లక్ష్మణుడు మొదలగు సోదరుల పట్ల ప్రేమ కలవాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

కేతకీ, కరవీర, జాతి సుగంధ పుష్పముల మాలతో శోభిల్లే వాడు, లక్ష్మిని కలిగిన వాడు, సీతాదేవి స్తనముల కుంకుమచే ఎరుపెక్కిన హృదయ భాగము (వక్ష స్థలము) కలవాడు, ఉత్తమోత్తముడు, అందరిని ఆకట్టుకునే వాడు, లోకేశ్వరుడు, భక్తుల భయము పోగొట్టే వాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

అగ్నిహోత్రము, దానము, ధ్యానము, ధూపము, జపము మొదలగు సేవల ద్వారా వేదార్థము తెలిసిన బ్రాహ్మణులచే అనన్యమైన భక్తితో కొలవబడిన వాడు, తాటకిని, వాలిని సంహరించిన వాడు, వారసత్వాన్ని కాపాడిన వాడు, ఏనుగువంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

ఖర దూషణులను అవలీలగా సంహరించిన వాడు, రావణుని సంహరించిన వాడు, నాశనము లేనివాడు, కోట్లాది వానర సమూహమునకు రక్షకుడు, కలువ వంటి ముఖము, పాద పద్మములు కలవాడు, హరి, లోకమునకు ఆశ్రయము, దేవతల కార్యము నెరవేర్చుటలో నిమగ్నుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

విశ్వామిత్రునిచే శస్త్రాస్త్రముల విద్య నేర్పబడిన వాడు, విశాలమైన నేత్రములు, అందమైన చిరునవ్వు కలవాడు, దీన బంధు, అన్నిలోకముల నివసించే వాడు, ఇంద్రుని, రావణుని శాసించే వాడు, ముక్తి మార్గము లో చిట్టచివరి గతి యైన వాడు, నీల మేఘ శ్యాముడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

భక్తి, శ్రద్ధలతో, రాముని పాదపద్మముల స్మరణతో ఈ రాఘవాష్టకం పఠించిన వారికి ఇష్టదేవతా సిద్ధి, రాముని ఆశ్రయము, భుక్తి, ముక్తి, ధన ధాన్య సమృద్ధి కలుగును.

రామునికి, రామ భద్రునికి జయము జయము మరియు నమస్కారములు. దేవ దేవునికి, దేవ రాజునకు, వాసుదేవునకు, వీరాధివీరునకు జయము జయము మరియు నమస్కారములు.

శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారుట.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడుట. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ ఈ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.  (ఇది కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ ఆధారంగా చెప్పబడింది)

పిశాచ పీడా నివృత్తికి, భీతిని పోగొట్ట టానికి, మానసిక దౌర్బల్యము నుండి బయట పడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్విత మైనది. ఇందులో శంకరుల భక్తి, ఆర్తి,  పతాకము స్పష్టముగా గోచరిస్తాయి.  అద్భుతమైన పద ప్రయోగము, నిర్మలమైన భావము, పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము.

శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, తాత్పర్యము, ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్) గారు దీన్ని శ్రావ్యంగా ఆలపించారు.


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
       భోగీంద్రభోగరమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
       సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౨

సంసారఘోరగహనే చరతో మురారే
       మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౩

సంసారకూపమతిఘోరమగాధమూలం
        సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపణాపదమాగతస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౪

సంసారసాగరవిశాలకరాలకాల
       నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౫

సంసారవృక్షమఘబీజమనంతకర్మ
       శాఖాశతం కరణపత్రమనంగపుష్పం
ఆరుహా దుఃఖఫలితం పతతో దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౬

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర
        దంష్ట్రాకరాలవిషదగ్ధవినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౭

సంసారదావదహనావదభీకరోరు
         జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీశరణాగతస్య
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౮

సంసారజాలపతితస్య జగన్నివాస
         సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
          లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౯

సంసారభీకరకరీంద్రకరాభిగాత
       నిష్పిష్టమర్మవపుషః సకలార్థినాశ
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౦

అంధస్య మే హృత్వివేకమహాధనస్య
       చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః
       కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
       మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మచిహ్నం
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౪

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
        దీనం విలోకయ విభో కరుణానిధే మాం
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక
       వ్యాసాది భగవత్పుంగవ హృన్నివాస
భక్తానురక్తపరిపాలనపారిజాత
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౬

లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన
       స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా
      స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం  ౧౭

            శ్రీ లక్ష్మీనృసింహార్పణమస్తు
ఇతి శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం

తాత్పర్యము: 

పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి,  స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.
 
ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల,  అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి.  ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ!  కమలనాభ!సురేశ! విష్ణో!  వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా!  జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి

లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

25, డిసెంబర్ 2010, శనివారం

శ్రీమచ్ఛంకరభగవతః కృత కృష్ణాష్టకం - తాత్పర్యము

శంకరులు రచించిన కృష్ణుని అష్టక ద్వయంలో రెండోది ఈ కృష్ణాష్టకం.  ఈ ద్వయంలో మొదటి శ్రీకృష్ణాష్టకంతో  పోలిస్తే ఇది వ్యాకరణ పరంగా కఠినమైనది. ఆధ్యాత్మికంగా లోతైనది. ధ్యాన రూపంలో శ్రీ కృష్ణుని స్తుతించేది ఈ అష్టకం. అపార కరుణాంబుధి, ప్రణత ఆర్తి హరుడు, ఆశ్రిత వాత్సల్యైక మహోదధి అయిన శ్రీ కృష్ణుండు నా ఈ భౌతిక చక్షువులకు కనిపించుమని శంకరులు వేడుకునే స్తోత్రము ఇది.  దీనికి పూర్వ పీఠిక శంకరుల తల్లి ఆర్యాంబ మరణము, ముక్తి.  వేదములలో నుతించబడిన లక్షనములన్ని కలిగినవాడు, సనాతనుడు, సర్వ జనులకు ఆత్మ యైన వాడు అయిన విష్ణువు, ఆది శంకరులచే  తన తల్లి ముక్తి కొరకు ఈవిధముగా పొగడబడినప్పుడు, లక్ష్మీ సమేతుడై శంఖము,  చక్రము,  గద తో కూడి ఆ యతి ముంగిట ప్రత్యక్షమై ఆర్యాంబకు ముక్తి ప్రసాదించాడు. 

మాతృ ఆత్మ మోక్ష సిద్ధ్యర్ధం శంకర నుత కృష్ణాష్టకం, తాత్పర్యం, శ్రవణం గోలి ఆంజనేయులు గారి గళంలో


శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౧

యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదం
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౨

అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలం
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౩

పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలం
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౪

మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౫

వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౬

నరాతంకోట్టంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౭

యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౮

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కృష్ణాష్టకం సంపూర్ణం
 

తాత్పర్యము: 

లక్ష్మీ సమేతుడు, విష్ణువు, స్థిర చరములకు గురువు, వేదముల ముఖ్యాంశము, జ్ఞానమునకు సాక్షి, శుద్ధుడు, హరి, అసురాంతకుడు, కలువల వంటి కళ్ళు కలవాడు, గద, శంఖము, చక్రము ధరించిన వాడు, స్థిరమైన రుచి కలవాడు, వనమాలి, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

పంచ భూతములకు మూలము, మధు సూదనుడు, ఆనందముతో లోకాన్ని కాపాడే వాడు, ప్రళయ సమయమున తన శక్తితో సర్వాన్ని తనలో విలీనం చేసే వాడు, కాపాడే వాడు,లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

నియమ బద్ధులై విధులను పాటించే, ఆత్మపై నియంత్రణ కలిగిన, లౌకిక విషయముల నుండి దూరముగా ఉండే,  స్థిరమైన మనసు కలిగిన జ్ఞానులచే దర్శించ బడిన వాడు,  కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

లోకమందు భాగమై దాన్ని శాసించే వాడు, మన బాధలను తొలగించే వాడు, వేదములలో చెప్పబడిన జగదీశుడు, శుద్ధమైన వాడు, శాసకుడు, దేవతల, ఋషుల, మానవుల యొక్క ధ్యాన మూలము అయిన వాడు,   మోక్ష కారకుడు, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ఇంద్రాది దేవతల అసురులపై విజయానికి మూల శక్తి,  ఎవరి ప్రోత్సాహము లేనిదే కర్మల నుండి విముక్తి కలుగదో, పాండిత్యము వలన కలిగిన కవుల గర్వమును పోగొట్టే వాడు,కాపాడే వాడు, లోకేశుడు అయిన అట్టి శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ఎవరిని ధ్యానిన్చకున్డుట వలన జనులు పంది వంటి పశు రూపములో జన్మ ఎత్తుతారో,  ఎవరిని తెలుసుకోక పోవటం వలన జన్మ మృత్యు మొదలగు వాటి భయము కలుగునో, ఎవరిని తలచ కుండుట వలన కీటకముల వలె జన్మింతురో, అట్టి కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

జనుల దుఃఖమును పోగొట్టేవాడు, శరణు కోరిన వారికి సాయ పడేవాడు, అయోమయాన్ని పోగొట్టే వాడు, నీల మేఘ శ్యాముడు, వ్రజ కులానికి ప్రియ బాలుడు, అర్జునునికి సఖుడు, స్వయంభూ, జీవ కోటిని సృష్టించే వాడు, శిక్షకుడు, రక్షకుడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ధర్మము నశించి భూ భారము పెరిగినప్పుడు, గోకుల నందనుడు, ధర్మ పాలకుడు, జన్మ లేనివాడు, సుజన రక్షకుడు, వేదములచే పొగడ బడిన వాడు అయిన శ్రీకృష్ణుడు ఆవతారము ఎత్తి ధర్మ సంస్థాపన  చేసే వాడు, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

24, డిసెంబర్ 2010, శుక్రవారం

ఏలా నీ దయరాదు బాలకనకమయ - త్యాగరాజ హృద్కమలము

సాక్షాత్కార కృతులు ఆయా దైవ స్వరూపం ప్రత్యక్షమైన పిదప వాగ్గేయ కారులు స్తుతించిన కీర్తనలు. ఇటువంటి కీర్తనలకు త్యాగయ్య వారి సాహిత్యం పుట్టినిల్లు. అందులో ఒకటి  అఠాణా రాగంలో కూర్చ బడిన బాల కనకమయ. అఠాణా రాగం మంచి లోతు, గాంభీర్యం, కారుణ్యం మొదలైన భక్తి రస లక్షణాలను నిదర్శింప చేసే శక్తి ఉన్న రాగం. ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు కట్టబడ్డాయి. అందులో ముఖ్యమైనవి శ్రీ మహాగణపతిం (మైసూర్ మహారాజు జయచామరాజ వడెయార్ రచించినది), త్యాగరాజు వారు రచించిన ఈ బాల కనకమయ.

సందర్భము:
త్యాగరాజ స్వామి వారు రచించిన కీర్తనలన్నిటిలో ఇది మొదటిది అని నానుడి. రామ తారక మంత్రానుష్ఠానమైన పిదప శ్ఱీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట ఆయన యాగ సంరక్షణార్థమై వెళుతున్న దృశ్యము త్యాగరాజస్వామి వారికి సాక్షాత్కారమవుంతుంది. ఆ పారవశ్యములో బాలకనకమయ చేల అనే బాలరాముని రూపాన్ని వర్ణించారు.


ఈ త్యాగయ్య కృతికి వస్తే, శ్రీ రాముని శుభలక్షణాలు, శౌర్య పరాక్రమాలు,  అలంకారములు, భక్త జన కారుణ్యము పేర్కొని నాపై ఏల దయ చూపించవు అని వేడుకొంటాడు కృతికర్త. అద్భుతమైన తెలుగు సాహిత్యము ఈ కృతిలో గుప్పించారు త్యాగబ్రహ్మ. కీర్తన సాహిత్యము, తాత్పర్య సంగ్రహము,
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో శాస్త్రీయ శ్రవణం,
సాగర సంగమం చిత్రంలో ఎస్. జానకి గారి గళంలో మంజు భార్గవి మరియు కమలహాసన్ గారి నాట్యం.


కృతి: ఏలా నీ దయరాదు  బాలకనకమయ 
రాగం: అఠాణా
తాళం: ఆది

ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయము గాదు

బాల కనకమయ చేల సుజన పరి
పాల శ్రీ రమాలోల విధృత శర
జాలశుభద కరుణాలవాల ఘన
నీల నవ్య వన మాలికాభరణ (ఏల)

రారా దేవాది దేవ రారా మహానుభావ 
రారా రాజీవనేత్ర రఘువర పుత్రా
సారతర సుధా పూర హృదయ పరి
వార జలధి గంభీర దనుజ సం
హార మదన సుకుమార బుధ జనవి
హార సకల శృతిసార నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజితపాద రవి
రాజలోచన శరణ్య అతి లావణ్య
రాజధరనుత విరాజతురగ సుర 
రాజ వందిత పాద  అజ జనక దీన
రాజకోటి సమతేజ దనుజ గజ
రాజ నిచయ మృగరాజ జలజముఖ (ఏల)

యాగరక్షణ పరమ భాగవతార్చిత 
యోగీంద్ర సుహృద్భావిత ఆద్యంత రహిత 
నాగశయన వర నాగవరద పు
న్నాగ సుమధర సదాఘమోచన
దా గతిజ ధృత పదాగమాంత చర 
రాగరహిత శ్రీ త్యాగరాజనుత (ఏల)

తాత్పర్యము: 

ఓ బాల రామా! బంగారము కూడిన ఆభరణములు, వస్త్రములు ధరించిన వాడా! సుజనులను కాపాడే వాడా!  లక్ష్మీ దేవిని కలిగిన వాడా! శరములు సంధించే వాడా! శుభము కలిగించి కరుణించే వాడా! ఘనుడా! నీల మేఘ శ్యామ! వనమాల ధరించిన వాడా!  నాపై ఏల దయరాదు?

దేవాదిదేవా! రా రా! మహానుభావా రా రా! అందమైన కన్నులు కలవాడా రా రా! రఘువంశములో పుట్టిన వాడా! అమృత హృదయులైన వారి పరివారం కలవాడా! సముద్రము వంటి గాంభీర్యము కలవాడా! అసురులను సంహరించే వాడా! మన్మథునిలా కుమారుడా! జ్ఞానులతో  మెలిగెడి వాడా! అన్ని శ్రుతుల సారమైన వాడా! శ్రీ రామా! నాపై ఏల దయరాదు?

రాజాధిరాజా! మునులచే పూజించ బడిన పాదములు కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా కలవాడా! శరణ్య! అతి సౌందర్య మూర్తి! చంద్రుని ధరించిన శివునిచే నుతించబడిన వాడా!  గరుత్మంతుని అధిరోహించిన ప్రభూ! దేవేంద్రునిచే పూజించబడిన వాడా! బ్రహ్మకు తండ్రీ! కోటి సూర్యుల ప్రకాశము కలవాడా! శత్రువుల పాలిట సింహమా! కమలము వంటి ముఖము కలవాడా! శ్రీ రామా! నాపై ఏల దయ రాదు?

యాగ రక్షకా! ఉత్తములచే నుతించ బడిన వాడా! యోగులచే ధ్యానించ బడిన వాడా! ఆద్యన్తములు లేని వాడా! శేష శయన! గజేంద్రుని రక్షించిన వాడా! పున్నాగ పూలు ధరించిన వాడా! ఎల్లప్పుడూ పాపములను నాశనము చేసే వాడా! ఎల్లప్పుడూ వాయుపుత్రుడైన హనుమంతునిచే సేవించబడే పాదములు కలవాడా! ఆగమముల అంశమా! కోరికలు లేని వాడా! త్యాగరాజునిచే నుతించబడిన రామా! నాపై ఏల దయరాదు?. పరాకు చేసేందుకు సమయము కాదు రామా!

గమనిక - ప్రాస కోసం చరణాలలోని పదాలను విడదీయవలసి వచ్చింది. సాహిత్యాన్ని కలిపి చదివి, పాడవలసినదిగా మనవి. 

శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము

శ్రీ కృష్ణుడు - ఈ జగదేక మోహన సుందర మూర్తిని వర్ణించటానికి ఆ పరమశివుడే దిగి వస్తే?  అప్పుడు పదాలు, భక్తి, వర్ణన అన్ని తమంతట తామే వచ్చి నిలబడతాయి. అందుకనే ఆది శంకరులు రచించినది ఏదైనా ఇన్ని వందల ఏళ్ళు నిలిచింది. సచ్చిదానంద అనుభూతిలో ఆ అపర శివుడు రచించిన ఈ శ్రీ కృష్ణాష్టకం ఆ నంద నందనుని అశేష గుణ గణములను, అద్వితీయమైన మహిమలను భక్తి రస మాలగా అందిస్తుంది. భక్తి నిండితే ఛందము, ప్రాస అవే పరుగిడుతూ ముత్యాల పేరలో చేరుతాయి అనటానికి ఈ స్తోత్రము ఒక గొప్ప నిదర్శనము.


యశోదా కృష్ణ

ఒక్కసారి ఇందులో పదాలు గమనించండి -

మండనం, ఖండనం, రంజనం, నందనం, మస్తకం, హస్తకం, సాగరం, నాగరం, మోచనం, లోచనం, శోచనం, భూధరం, సుందరం, దారణం, వారణం, కుండలం, మండలం, దుర్లభం, వల్లభం, దాయకం, సాయకం, గాయకం, నాయకం, పంకజం, నిజం, మాలకం, బాలకాం, శోషణం, పోషణం, మానసం, లాలసం, తారకం, దారకం, కిశోరకం, చోరకం, భంగినం, సంగినం, నవం, సంభవం, కందనం, నందనం, లంపటం, లసత్పటం, పాయినం, శాయినం, రంజితం, శోభితం, కారిణం, విహారిణం 

- ఇలా ఆ నీల మేఘ శ్యాముని గుణ వర్ణన అందమైన జడ కుప్పెలలా, చిరు గజ్జెలలోని మువ్వలలా, హారంలో పొదిగిన రత్నాలలా, మల్లె మాలలోని పూలలా, పసి పిల్లల సమూహంలా శుద్ధంగా, చిదానందంగా పొదగబడ్డాయి ఈ స్తోత్రంలో. అది ఆదిశంకరుల శంకరత్వము. అందుకే ఆయన భగవత్పాదులు, జగద్గురువులు, లోక పూజ్యులు అయ్యారు.

కృష్ణాష్టకం, తాత్పర్యము, శ్రవణం.

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం

మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనం
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం

కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం

సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకం
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసం

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకం
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనం
నవీనగోపనాగరం నవీనకేళిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం

సమస్తగోపనందనం హృదంబుజైకమోదనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనం
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకం

విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవ్రద్ధవహ్నిపాయినం
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణం

యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన
భవేత్స నందనందనే భవే భవే సుభక్తిమాన

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం ..
            శ్రీ కృష్ణార్పణమస్తు ..

గోవర్ధన గిరిధారి

తాత్పర్యము:

వ్రజ కులైక భూషణుడు, సర్వ పాప హరుడు, భక్తుల మనస్సులను రంజింప చేసే వాడు, నందుని ఆనంద దాయకుడు, నెమలి పింఛం మస్తకముపై కలవాడు, తీయని గానము వినిపించే వేణువు చేతిలో కలవాడు, ప్రేమ సాగరుడు అయిన కొంటె కృష్ణుని  భజిస్తున్నాను.

కామదేవుని గర్వము అణచిన వాడు, అందమైన, విశాలమైన కన్నులు కలవాడు, గోపకుల శోకాన్ని పోగొట్టే వాడు, పద్మ లోచనుడు, గోవర్ధన పర్వతమును ఎత్తిన వాడు, చక్కని చిరునవ్వు, చూపులు కలవాడు, ఇంద్రుని గర్వము అణచిన వాడు, గజ రాజు వంటి వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

కదంబ పుష్పముల కర్ణ కుండలములు ధరించిన వాడు, అందమైన కపోలములు (బుగ్గలు) కలవాడు, వ్రజ గోపికల ఏకైక వల్లభుడు, (భక్తి తప్ప ఇతర మార్గముల ద్వార) దుర్లభుడు, గోపికలు, నందుడు, అమితమైన ఆనందములో ఉండే యశోద తన దగ్గర కలవాడు, భక్తులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోప కుల నాయకుడు అయిన శ్రీ కృష్ణునికి నమస్కారములు.

నందుని కుమారుడు, తన పాదపద్మములను నా హృదయమందు ఉంచిన వాడు, చక్కని కేశములు కలవాడు, సర్వ దోషములను హరించే వాడు, లోకాన్ని పోషించే వాడు, గోప కులము మనసులో ఉండేవాడు, నందునిచే లాలించబడిన వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా భూ భారాన్ని తగ్గించే వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యశోద తనయుడు, అందరి మనసులను దోచుకునే వాడు, నందుని కుమారుడు, అందమైన కళ్ళు కలవాడు, ఎప్పుడూ సత్పురుషుల సాంగత్యములో ఉండేవాడు, ప్రతి రోజు కొత్త కొత్తగా కనిపించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

సర్వ శుభలక్షణములు కలవాడు, సుఖము, కృప ఇచ్చే వాడు, అనంతమైన కృప కలవాడు, రాక్షసులను సంహరించే వాడు, గోపులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోపాలకుడు, కొత్త కొత్త ఆటలయందు ఆసక్తి చూపించే వాడు, నల్లని మేఘము వంటి శరీరము కలవాడు, మెరుపు వలె మెరిసే పీతాంబరము ధరించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

గోపకుల జనులను ఆనంద పరచి వారి మధ్య కుంజములో (పొదలలో) ఉండే వాడు, సూర్యుని వలె వెలిగి భక్త జన హృదయమనే కమలములను వికసింప చేసే వాడు, భక్త జన కామ్యములను తీర్చె వాడు, బాణముల వంటి చూపులు కలవాడు, మంచి నాదముతో వేణువును వాయించే వాడు, కుంజ (పొదలకు) నాయకుడు, అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఎల్లప్పుడూ తన గురించి ఆలోచించే మనోజ్ఞమైన గోపికల మనసులు అనే తల్పముపై శయనించే వాడు, గోపకులాన్ని కాపాడుటకు అడవి దావాగ్నిని మ్రింగిన వాడు, నల్లని అంజనముతో, లేత ప్రాయముతో శోభిల్లే కళ్ళు కలవాడు, గజేంద్రునికి మోక్షము కలిగించిన వాడు, లక్ష్మీ పతి అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఫల శృతి:

ఓ శ్రీ కృష్ణా! నీ గుణ, కథ కీర్తన నేను చేసేలా నన్ను అనుగ్రహించుము. ఈ అష్టక ద్వయం (ఇది మరియు కృష్ణాష్టకం) పఠించే వారికి ప్రతి జన్మలోను శ్రీ కృష్ణుని భక్తి కలుగును.

23, డిసెంబర్ 2010, గురువారం

అచ్యుతాష్టకం - తాత్పర్యం

భజనలు, హారతులు, సంకీర్తనలు మొదలైన వాటిలో తప్పని సరిగా ఉండే పంక్తుల్లో ఈ అచ్యుతాష్టకం లోని మొదటి శ్లోకము ఒకటి. ఆ శ్రీ కృష్ణుని దివ్యంగా స్తుతించే ఈ అష్టకంలో విష్ణును రామ, కృష్ణ అవతారములను, కృష్ణుని ఇష్ట సఖులను, సతులను,  సౌందర్యాన్ని, ఆభరణములను, అలంకారాలను, మహిమలను, లీలలను వర్ణించారు, స్తుతించారు ఆది శంకరులు. అచ్యుతాష్టకం, తాత్పర్యము మీకోసం. శ్రవణం కే.జే. ఏసుదాస్ గారి గళంలో.




అచ్యుతం కేశవం రామ నారాయణం  కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం  జానకీనాయకం రామచంద్రం భజే

అచ్యుతం కేశవం సత్యభామాధవం  మాధవం శ్రీధరం రాధికారాధితం
ఇందిరా మందిరం చేతసా సుందరం  దేవకీనందనం నందనం సందధే

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే  రుక్మిణీ రాగిణే జానకీ జానయే
వల్లవీ వల్లభాయాఽర్చితాయాత్మనే  కంస విధ్వంసినే వంశినే తే నమః

కృష్ణ గోవింద హే రామ నారాయణ  శ్రీపతే వాసుదేవాజిత శ్రినిధే
అచ్యుతానంత హే మాధవాధోక్షజ  ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక

రాక్షసక్షోభితః సీతయాశోభితో  దండకారణ్య భూ పుణ్యతా కారణః
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితోఽగస్త్య సంపూజితో రాఘవః పాతు మాం

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిహా  కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజా ఖేలనో  బాల గోపాలకః పాతు మామ్ సర్వదా

విద్యుదుద్ధయోతవాన ప్రస్ఫురద్వాససం  ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహం
వన్యయా మాలయా శోభితోరఃస్థలం  లోహితాంఘ్రిద్వ్యం వారిజాక్షం భజే

కుంచితైః కుంతలైర్భ్రాజిమానాననం  రత్నమౌళిం లసత్కుండలం గండయోః
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం  కింకిణీ మంజులం శ్యామలం తం భజే

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టం ప్రేమతః ప్రత్యహంపూరుషస్సస్పృహం
వృత్తతః సుందరం కర్తృవిశ్వంభర స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరం

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత అచ్యుతాష్టకం సంపూర్ణం

తాత్పర్యము: 

మరణములేని వాడు, కేశిని సంహరించిన వాడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, శ్రీ హరి, లక్ష్మీ దేవిని ధరించిన వాడు, మాధవుడు, గోపికలకు వల్లభుడు, జానకీ పతి అయిన శ్రీరాముని భజిస్తున్నాను.

మరణములేని వాడు, కేశిని సంహరించిన వాడు, సత్యభామకు పతి, లక్ష్మీ దేవిని ధరించిన వాడు, మాధవుడు, రాధచే ఆరాధింప బడిన వాడు, ఇందిరను (లక్ష్మీదేవిని) హృదయమున కలవాడు,  సుందరమైన వాడు, దేవకీ తనయుడు, నంద కుమారుడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

అంతటా యున్నవాడు (విష్ణువు), ఎల్లప్పుడూ జయము కలవాడు, శంఖ చక్రములు ధరించిన వాడు, రుక్మిణి మనోహరుడు, జానకి ఆత్మయైన వాడు, గోపికల వల్లభుడై వారిచే కొలువ బడిన వాడు, కంసుని సంహరించిన వాడు, ఉత్తముడు అయిన శ్రీ కృష్ణునికి నమస్కరిస్తున్నాను.

హే కృష్ణ! గోవింద! రామా! నారాయణ!  శ్రీ పతి! వసుదేవుని కుమారునిగా పేరుగాంచిన వాడ! శ్రీ నిధీ! అననతమైన ఆనందానికి ఆలవాలమా! మాధవా! ఎల్లప్పుడూ జయము కలిగే అధోక్షజా! ద్రౌపదీ మాన రక్షకా! నన్ను రక్షించుము.

రాక్షసులను శిక్షించే వాడు, సీతతో కలిసి శోభిల్లే వాడు, దండకారణ్యమును పునీతము చేసిన వాడు, లక్ష్మణునిచే అనుగమింప బడి, వానరులచే సేవించబడిన వాడు, అగస్త్యునిచే పూజించ బడినవాడు అయిన రాఘవునికి వందనములు.

ధేనుక మరియు అరిష్టకులను సంహరించిన వాడు, తనను ద్వేషించిన కేశి, కంసులను సంహరించిన వాడు, వేణువును వాయించే వాడు, పూతనను సంహరించిన వాడు, నదిలో క్రీడ అంటే ఇష్టపడే వాడు అయిన శ్రీ కృష్ణునికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.

సుందర నయనములు కలవాడు, మెరుపులా వంటి వస్త్రములు ధరించిన వాడు, వర్ష కాలములోని మేఘముల వంటి రూపములో శోభిల్లిన వాడు, వనమాల హృదయ స్థానమున ధరించిన వాడు, ఎర్రని పాదములు కలవాడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

చిరు గజ్జెలు ధరించిన వాడు, నల్లని మేనితో మెరిసే వాడు, వికసించిన వదనము, మెలికలు తిరిగిన కేశములు కలవాడు, చెవులకు ధరించిన కుండలముల వెలుగుతో ప్రకాశించే బుగ్గలు కలవాడు, బంగారు హారములు, మెరిసే కంకణములు ధరించిన వాడు అయిన శ్రీ కృష్ణుని భజిస్తున్నాను.

ఫల శృతి: 

ప్రేమతో, భక్తితో రచించబడిన ఈ సుందరమైన అష్టకము, అచ్యుతునికి ఎంతో ప్రియమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు వేగముగా శ్రీ హరి సన్నిధిని చేరుదురు.

22, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - తృతీయ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం -  తృతీయ  స్కంధము



ఎనిమిదవ దశకము - ప్రళయానంతర జగత్సృష్టి

ఏవం తావత్ప్రాకృతప్రక్షయాంతే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా |
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానామ్ || ౮-౧||

ప్రభూ! మహా ప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మ కల్పము ప్రారంభమగును. ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొన్నట్లు నీవలన జన్మించాడు. అట్లే నీ యొక్క అనుగ్రహమువలననే వేదములను పొంది అంతకుముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలిడెను. 

సోఽయం చతుర్యుగసహస్రమితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ |
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః
నైమిత్తికప్రళయమాహురతోఽస్య రాత్రిమ్ || ౮-౨||

స్వామీ! వేయి చతుర్యుగముల పరిమాణము గల కాలము బ్రహ్మకు ఒక పగలు. అంతే పరిమాణము గల కాలము ఆయనకు ఒక రాత్రి. ఇంత వరకు ఆయనకు ఇట్టి పగళ్ళు, రాత్రులు ఎన్నో గడిచిపోయాయి. రాత్రులందు అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రించును. బ్రహ్మ దేవుడు ఇట్లు నిద్రించియుండు రాత్రిని నైమిత్తిక ప్రళయము అని అందురు.

అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ |
ప్రాగ్బ్రహ్మకల్పజనుషాం చ పరాయుషాం తు
సుప్తప్రబోధనసమాఽస్తి తదాఽపి సృష్టిః || ౮-౩||

రాత్రి గడచిన తరువాత నిద్రలేచి మేము నిత్యక్రుత్యములను ప్రారంభించునట్లు బ్రహ్మదేవుడు నైమిత్తిక ప్రళయము తర్వాత మీ అనుగ్రహము వలన పునః సృష్టి చేయుటకు ఆరంభించును. భ్రుగు మహర్షి మొదలగు చిరంజీవులు బ్రహ్మ వలెనె నిద్రింతురు మరియు మేల్కొందురు. వారికి పూర్వ స్మృతి యుండును. ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు.

పంచాశదబ్దమధునా స్వవయోఽర్ధరూపమ్
ఏకం పరార్ధమతివృత్య హి వర్తతేఽసౌ |
తత్రాంత్యరాత్రిజనితాన్కథయామి భూమన్
పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్ || ౮-౪||

ప్రస్తుతము బ్రహ్మదేవుని వయస్సులో సగమైన యాభై సంవత్సరములు గడచి పోయినవి. దీనిని పరార్థమందురు. ఈ మొదటి పరార్థము గడచిన తర్వాత పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను ప్రస్తుతము వర్ణింతును.

దినావసానేఽథ సరోజయోనిః
సుషుప్తికామస్త్వయి సన్నిలిల్యే |
జగంతి చ త్వజ్జఠరం సమీయు-
స్తదేదమేకార్ణవమాస విశ్వమ్ || ౮-౫||

బ్రహ్మదేవుని మొదటి పరార్థము యొక్క చివరి పగలు గడచిన తర్వాత రాత్రియైనప్పుడు అతడు నిద్రపోదలచి నీ యందు విలీనమయ్యెను. ఆ సమయమున సమస్త లోకములు నీ యందే విలీనమైనవి. అప్పుడు విశ్వమంతయు జలమయమై యుండెను.

తవైవ వేషే ఫణిరాజ శేషే
జలైకశేషే భువనే స్మ శేషే |
ఆనందసాంద్రానుభవస్వరూపః
స్వయోగనిద్రాపరిముద్రితాత్మా || ౮-౬||

విశ్వమంతయు జలమయమై యుండగా నీయొక్క అంగభూతమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగ నిద్ర యందు మునిగి యుంటివి.

కాలాఖ్యశక్తిం ప్రళయావసానే
ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ |
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తి-
వ్రజేన తత్రాఖిలజీవధామ్నా || ౮-౭||

ఓ నారాయణా! ప్రళయ సమయమందు సమస్త శక్తులు నీలో విలీనమగును. ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రయమైన నీవు కాలశక్తితో "ఈ ప్రళయము చివర నన్ను లేపు" మని ఆజ్ఞాపించి నిదుర పోతివి.

చతుర్యుగాణాం చ సహస్రమేవం
త్వయి ప్రసుప్తే పునరద్వితీయే |
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్ధా
ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథ || ౮-౮||

జగన్నాథా! నీవిటుల ఒంటరిగా శేషతల్పముపై వేయి మహాయుగములు నిదుర పోవుచున్నప్పుడు తొలుత నుండియు మేలుకొనియే యున్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడచిన తరువాత తాను నిన్ను యోగ నిదుర నుండి లేపినది.

విబుధ్య చ త్వం జలగర్భశాయిన్
విలోక్య లోకానఖిలాన్ప్రలీనాన్ |
తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాంతః
స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్ || ౮-౯||

జలములందు నిదుర పోవుచున్న నారాయణా! నీవు లేచి చూడగా సమస్త లోకములు నీ యందు విలీనమై కనిపించినవి. నీ యందు సూక్ష్మరూపమున విలీనమై యున్న ఆ లోకములన్నిటినీ నీవు చూచితివి.

తతస్త్వదీయాదయి నాభిరంధ్రా-
దుదంచితం కించన దివ్యపద్మమ్|
నిలీననిశ్శేషపదార్థమాలా
సంక్షేపరూపం ముకుళాయమానమ్ || ౮-౧౦||

స్వామీ! శేష శయ్యపై పడుకొని యున్న నీ యొక్క నాభి రంధ్రము నుండి అర్ధ వికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది. నీ యందు విలీనమైన సమస్త పదార్థములు అతి సూక్ష్మ రూపమైన దానిలో ఉండినవి.

తదేతదంభోరుహకుడ్మలం తే
కళేబరాత్తోయపథే ప్రరూఢమ్ |
బహిర్నిరీతం పరితః స్ఫురద్భిః
స్వధామభిర్ధ్వాంతమలం న్యకృంతత్ || ౮-౧౧||

ప్రభూ! నీ నాభి యందు అంకురించిన ఈ తామర మొగ్గ నీటి నుండి  బయటకు వచ్చి వికసించినది. ఈ విధముగా బయటకు వచ్చిన ఆ పద్మము యొక్క కాంతి నాలుగు దిక్కులయందు వ్యాపించి అచ్చట నున్న చీకటి నంతా తొలగించినది.

సంఫుల్లపత్రే నితరాం విచిత్రే
తస్మిన్భవద్వీర్యధృతే సరోజే |
స పద్మజన్మా విధిరావిరాసీత్
స్వయంప్రబుద్ధాఖిలవేదరాశిః || ౮-౧౨||

ప్రభూ! నీ యోగశక్తిచే ప్రభావితమైన ఆ కమలము మిగుల విచిత్రముగా ఉండెను. దాని దళములు బాగా వికసించి యుండెను. పూర్వము బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భావము ఈ కమలము నందే జరిగెను. నీ అనుగ్రహము వలననే ఆయనకు వెద రహస్యములు స్వయముగా అవగతమయ్యేను.

అస్మిన్పరాత్మన్ నను పద్మకల్పే
త్వమిత్థముత్థాపితపద్మయోనిః |
అనంతభూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో || ౮-౧౩||

పరమాత్మా! గురువాయుపుర నిలయా! శ్రీ మహావిష్ణూ! ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవుని ఆవిర్భవింప చేసితివి. ఈ విధముగా అనంతమైన మహిమలున్న శ్రీకృష్ణా! నీవు దయతో నా రోగములన్నిటినీ పోగొట్టుము.

తొమ్మిదవ దశకము - జగత్సృష్టిప్రకార వర్ణనము

స్థితః స కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే
కుతః స్విదిదమంబుధావుదితమిత్యనాలోకాయన్ |
తదీక్షణకుతూహలాత్ప్రతిదిశం వివృత్తానన-
శ్చతుర్వదనతామగాద్వికసదష్టదృష్ట్యంబుజామ్ || ౯-౧||

స్వామీ! నీ నాభికమలమందున్న బ్రహ్మ దేవుడు "అగాధము, విశాలమైన ఈ సముద్రములో పద్మము ఏ విధముగా వచ్చినది" అని ఆశ్చర్యమునకు లోనయ్యెను. వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానము తెలిసికొనుటకై అన్ని దిక్కులందు చూచినాడు. ఈ విధముగా నాలుగు దిక్కులందు ముఖములనుంచి చూచినందు వలెనే ఆయన చతుర్ముఖుడయ్యెను. 

మహార్ణవవిఘూర్ణితం కమలమేవ తత్కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్ |
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతః స్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్ || ౯-౨||

ప్రభూ! మహా సముద్రమున స్థిరముగా నున్న ఆ కమలమును మాత్రమే చూచినా బ్రహ్మదేవుడు దానికి ఆధారముగా నున్న నీ తనువును గమనింప లేకపోయెను. అంతట అతడు "ఈ మహా కమలగర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడనై యున్నాను. ఇంతకును ఈ కమలము ఎక్కడినుండి వచ్చినది?" - అని చింతింప సాగెను.

అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్-
ఇతిస్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రాధ్వనా |
స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ప్రౌఢధీః
త్వదీయమతిమోహనం న తు కళేబరం దృష్టవాన్ || ౯-౩||

ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉంది యుండునని బ్రహ్మ దేవుడు స్థిర నిశ్చయము చేసికొనెను. గొప్ప ప్రజ్ఞ కల ఆ బ్రహ్మదేవుడు తన యోగ విద్యా బలమున ఆ పద్మము యొక్క ఆధారము తెలిసికొనుటకై ఆ పద్మ నాళమున ప్రవేశించి వేడుక సాగెను. ఐనప్పటికిని సుందర మోహన రూపమైన నీ దివ్య శరీరము మాతము అతనికి కనిపించలేదు.

తతస్సకలనాళికావివరమార్గగో మార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ |
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ || ౯-౪||

ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మ నాళమున ప్రవేశించి నూరు దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించి నప్పటికీ అతనికేమియు కనపడలేదు. అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మను నందు సుఖాసమున కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో నీ అనుగ్రహమును కోరుకొనుచు తన తపస్సమాధి యందు నిమగ్నుడయ్యెను.

శతేన పరివత్సరైర్దృఢసమాధిబంధోల్లసత్-
ప్రబోధవిశదీకృతః స ఖలు పద్మినీసంభవః |
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయమ్ || ౯-౫||

ఈ విధముగా పద్మ సంభవుడైన బ్రహ్మ దేవుడు నూరు దివ్య సంవత్సరములు తపస్సమాధి యందుండెను. అట్టి తపస్సమాధి వలన బ్రహ్మ దేవునకు జ్ఞానోదయం అయ్యెను. అందువల్ల సంతోషించి తానింతవరకూ చూడనిది అత్యద్భుతమైనది, ఆదిశేషుని పడగలను ఆధారము చేసుకొనియున్నది అగు నీ దివ్య రూపమును అంతర్జ్ఞానము చే చూసి సంతోషించెను.

కిరీటముకుటోల్లసత్కటకహారకేయూరయుక్
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరమ్ |
కలాయకుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితమ్ || ౯-౬||

స్వామీ! బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపము ఇట్లున్నది. నీ శిరమున కిరీట మకుటములు శోభిల్లు చున్నవి. మణి బంధము నందు కంకణములు, వక్షః స్థలమున ముత్యాల హారములు, బాహువుల యందు భుజకీర్తులు విరాజిల్లుచున్నవి. నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణము మిలమిల లాడుచున్నది. నీవు ధరించిన పట్టు పీతాంబరం మనోహరముగా నున్నది. నీ హారమునందు కౌస్తుభమణి ధగ ధగ లాడుచున్నది. నల్ల కలువల కాంతులు వెదజల్లుతున్న అట్టి నీ దివ్య స్వరూపమును నేను ధ్యానించు చున్నాను.

శ్రుతిప్రకరదర్శితప్రచురవైభవ శ్రీపతే
హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యా దృశోః |
కురుష్వ ధియమాశు మే భువననిర్మితౌ కర్మఠా
మితి ద్రుహిణవర్ణితస్వగుణబృంహిమా పాహి మామ్ || ౯-౭||

'లక్ష్మీ పతి! అంతులేని నీ వైభవమును  వేదములు స్తుతించు చున్నవి. శ్రీ హరీ! అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగు గాక! నా అదృష్టము వలన నీవు నాకు కనిపించితివి.  అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్నమగునట్లు చేయుము అని బ్రహ్మ దేవుడు స్తుతించెను. అట్టి దివ్య వైభవము కల శ్రీ హరీ! నన్ను కరుణతో రోగ బాధనుండి రక్షింపుము.

లభస్వ భువనత్రయీరచనదక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే |
భవత్వఖిలసాధనీ మయి చ భక్తిరత్యుత్కటే-
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసమ్ || ౯-౮||

అప్పుడు నీవు బ్రహ్మ దేవునితో "విధీ! ముల్లోకములను సృష్టించు నీ సామర్థ్యము అకుంఠితముగా ఉందును. నా అనుగ్రహం నీకు తప్పక లభించును. నీవు ఇంకను తపస్సు చేయవలెను. అన్ని విధములైన కోరికలను తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును". అని చెప్పినందు వలన అతనికి అంతులేని సంతోషము కలిగెను.

శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరా-
నవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్ |
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బలవిజృంభితః పవనపాథసీ పీతవాన్ || ౯-౯||

నీవు ఆజ్ఞాపించి నట్లే బ్రహ్మ దేవుడు నూరు దివ్య సంవత్సరములు నియమ నిష్ఠలతో తపస్సు చేసెను. అందువలన అతనికి పూర్వము కంటే అధికముగా తపోబలము, బుద్ధిబలము కలిగినవి. అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో అటు ఇటు కదలసాగింది. అంతట బ్రహ్మదేవుడు నీ ప్రభావము వలన అధికమైన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని ఉపసంహరించెను.

తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ |
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వర
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః || ౯-౧౦||

తరువాత ఆ బ్రహ్మ దేవుడు నీ అనుగ్రహము చేత తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించెను. అటు పిమ్మట జీవ సృష్టి కూడా చేయుటకు మొదలు పెట్టెను. గురువాయురప్ప! ఈ విధముగా నీవు గొప్ప దయ కలవాడవు. అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడనై యున్న నాపై కూడా చూపి నన్ను రక్షింపుము.

పదవ దశకము సృష్టిభేదదర్శనము

వైకుంఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా-
దంభోజయోనిరసృజత్కిల జీవదేహాన్ |
స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాం
జాతీర్మనుష్యనివహానపి దేవభేదాన్ || ౧౦-౧||

వైకుంఠ నాథా! నీ అనుగ్రహము వలన తపోబలమును బుద్ధి బలమును మిక్కుటముగా సంపాదించుకున్న బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించెను. అతడు స్థిరముగా ఉండు వృక్షాదులను. అడ్డముగా ఉండి నడిచే పశువులను, పక్షులను, అట్లే మానవులను, సిద్ధులు, చారనులు మొదలైన దేవతలను సృష్టించెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టించెను.

మిథ్యాగ్రహాస్మిమతిరాగవికోపభీతి-
రజ్ఞానవృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా |
ఉద్దామతామసపదార్థవిధానదూన
స్తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధ్యై || ౧౦-౨||

బ్రహ్మదేవుడు అనేక విధములగు జీవులను సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన ఐదు అజ్ఞాన చిత్తవృత్తులను సృష్టించెను. అవి మిథ్యాగ్రహము, అహంభావము, రాగము, కోపము, భయము అనునవి. ఈ తామస చిత్తవృత్తులను సృష్టి చేసిన తరువాత బ్రహ్మదేవుని మనస్సంతయు బాధతో నిండి పోయెను. ఆ బాధను తొలగించు కొనుటకు, తన యొక్క మానస పరిశుద్ధికి అతడు నీ పాదారవిందములను భక్తితో స్మరింప సాగెను.

తావత్ససర్జ మనసా సనకం సనందం
భూయం సనాతనమునిం చ సనత్కుమారమ్ |
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానా
స్త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీమ్ || ౧౦-౩||

ఆ తరువాత బ్రహ్మదేవుడు తన సంకల్ప బలమువలన సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను బ్రహ్మర్షులను సృష్టించెను. సృష్టి కార్యమునందు పాల్గొన వలసినదిగా బ్రహ్మదేవుడు వారిని ఆదేశించెను. కాని వారందరూ పరమాత్మవగు నీ పాద పద్మములందు అంతులేని భక్తి కలవారు కావున అతని మాటలను గౌరవించ లేదు.

తావత్ప్రకోపముదితం ప్రతిరుంధతోఽస్య
భ్రూమధ్యతోఽజని మృడో భవదేకదేశః |
నామాని మే కురు పదాని చ హా విరించే
త్యాదౌ రురోద కిల తేన స రుద్రనామా || ౧౦-౪||

తన మానస పుత్రులు తాను చెప్పిన మాట వినుట లేదని బ్రహ్మ కోపగించెను. అతడు తన కోపమును బయటకు తెలియకుండా బిగబట్టి నప్పుడు అతని కనుబొమ్మల మధ్య నుండి నీ అంశ స్వరూపమైన రుద్రుడు కలిగెను. అతడు పుట్టగానే " బ్రహ్మ దేవా! నాకు తగిన పేర్లను, నేనున్డుటకు తగిన స్థానములను కల్పించుము" - అని బిగ్గరగా ఏడ్చినందు వలన అతనికి రుద్రుడని పేరు ఏర్పడెను.

ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా |
తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్ || ౧౦-౫||

అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మవగు నీ ప్రేరణ వలన రుద్రునకు పదకొండు పేర్లు గల వివిధములైన రూపములను ఏర్పరచెను. ఇంకను ఆ ఏకాదశ రుద్రులకు పదకొండు భార్యలను ఇచ్చి వారందరూ ఉండుటకు భిన్న భిన్నమైన ప్రదేశములను కూడా ఏర్పరచెను. ఆ తరువాత సంతాన అభివృద్ధి చేయుడని సాదరముగా వారిని కోరెను.

రుద్రాభిసృష్టభయదాకృతిరుద్రసంఘ-
సంపూర్యమాణాభువనత్రయభీతచేతాః |
మా మా ప్రజాః సృజ తపశ్చర మంగలాయే
త్యాచష్ట తం కమలభూర్భవదీరితాత్మా || ౧౦-౬||

బ్రహ్మదేవుని మాటను అనుసరించి ఏకాదశ రుద్రులు సంతాన అభివృద్ధి చేయసాగిరి. వార సంతానము మహా భయంకరముగా ఉండి ముల్లోకములను భయపెట్ట సాగెను. అట్టి రుద్ర సంతానము ముల్లోకముల యందు నిండు చుండగా బ్రహ్మదేవునకు కూడా భయము కలిగెను. అందువలన నీ ఆదేశాముచే బ్రహ్మదేవుడు "ఇక మీరు సంతాన సృష్టిని నిలిపివేసి లోకములకు మంగళము కలుగుటకై తపస్సు ఆచరింపుడు" అని కోరెను.

తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిః
తత్రాంగిరాః క్రతుమినిః పులహః పులస్త్యః |
అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః || ౧౦-౭||

స్వామీ! చక్కగా సృష్టిని చేయుచున్న బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవముల నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, క్రతువు, పులహుడు, పులస్త్యుడు, భ్రుగువు అను మహర్షులు జన్మించిరి. అట్లే వశిష్ఠుడు, దక్ష ప్రజాపతి, నారదుడు కూడా జన్మించిరి.

ధర్మాదికానభిసృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరంగజసంకులోఽభూత్ |
త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజై
రుద్బోధితశ్చ విరరామ తమో విముంచన్ || ౧౦-౮||

అత్రి, మరీచి మొదలైన మహర్షులను సృష్టించిన తరువాత బ్రహ్మ కర్దమ ప్రజాపతిని, ధర్ముడు మొదలైన వారిని కూడా సృష్టించెను. పిమ్మట సరస్వతిని సృజించెను. ఆమె అందచందములను చూసి బ్రహ్మ దేవుడు మోహ పరవశు డయ్యెను. అప్పుడు నీ ప్రేరణ వలన సనకుడు దక్షుడు మొదలైన వారు బ్రహ్మదేవుని అడ్డుకొని సమ్యక్ జ్ఞానము కలుగునట్లు చేసిరి. ఆ విధముగా తన పుత్రుల బోధనవలన బ్రహ్మ తమో గుణమును వదలి స్వస్థుడు అయ్యెను.

వేదాన్పురాణనివహానపి సర్వవిద్యాః
కుర్వన్నిజాననగణాచ్చతురాననోఽసౌ |
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్ధి
మప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోఽభూత్ || ౧౦-౯||

తరువాత చతుర్ముఖ బ్రహ్మ సమస్త వేదములను, పురాణములను, సకల విద్యలను, తన నాలుగు ముఖముల నుండి ఆవిర్భవింప చేసెను. అట్లే అతడు ఆ వేదవిద్యలను అన్నిటినీ తన పుత్రులకు ఉపదేశించెను. ఈ విధముగా బ్రహ్మ చరాచరములను, విద్యలను సృష్టించిన తరువాత తిరిగి సృష్టి చేయ జాలక తిరిగి నీ పాద పద్మములను ఆశ్రయించెను.

జానన్నుపాయమథ దేహమజో విభజ్య
స్త్రీపుంసభావమభజన్మనుతద్వధూభ్యామ్ |
తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం
గోవింద మారుతపురాధిప నిరుంధి రోగాన్ || ౧౦-౧౦||

అప్పుడతనికి సృష్టిని పెంపొందింప చేయు ఉపాయము తట్టినది. అందువలన అతడు తన శరీరమును రెండుగా విభజించు కొనెను. అతని శరీరము నందలి ఒక భాగము పురుషుడుగా, మరియొక భాగము స్త్రీగా అయ్యెను. వారే మనువు, అతని భార్య యైన శాత రూప. నీవు ఆ జంట వలన ఈ సృష్టి ఇంకను వృద్ధి చెందునట్లు చేసితివి. ఈ విధముగా సృష్టిని పెంపొందింప చేసిన గురువాయురప్ప! గోవిందా! నీవు నా రోగములన్నిటినీ దయతో తొలగించుము.


పదకొండవ దశకము  - హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము

క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే |
భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ || ౧౧-౧||

గురువాయుపుర దేవా! ఈ విధముగా చరాచర సృష్టి అనుదినము జరుగుచుండినది. ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాది మహర్షులు నిన్ను దర్శించు కొనవలెనను కుతూహలముతో వైకుంఠమునకు వచ్చిరి.

మనోజ్ఞనౌశ్రేయసకాననాద్యైరనేకవాపీమిణిమందిరైశ్చ |
అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః || ౧౧-౨

స్వామీ! మీరు నివశించుచున్న వైకుంఠ లోకములో 'నైశ్రేయసము' అను పేరుగల గొప్ప ఉద్యానవనమున్నది. ఇట్టి ఉద్యాన వనములెన్నియో అక్కడ ఉన్నవి. అట్లే, అనేకమైన దిగుడు బావులున్నవి. అక్కడ ఉన్న భవనములన్నియు మణి రత్న ఖచితములు. అటువంటి నీ వైకుంఠములోని కక్ష్యలన్నియు గడచి సాటిలేని సౌందర్యము కల నీ భవనమును ఆ మహర్షులు చేరుకొనిరి.
 
భవద్దిదృక్షూన్భవనం వివిక్షూన్ద్వాఃస్థౌ జయస్థాన్ విజయోఽప్యరుంధామ్ |
తేషాం చ చిత్తే పదమాప కోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ || ౧౧-౩

మహర్షులు నీ దివ్య దర్శనము చేసుకొనవలెనని నీ మహా భవనములోనికి ప్రవేశించ కోరుచుండగా అచ్చటి ద్వార పాలకులైన జయుడు, విజయుడు అనువారు వారిని అడ్డగించిరి. అందువలన మహర్షులకు మిక్కిలి కోపము కలిగినది. స్వామీ! ఇదంతయు నీ ప్రేరేపణ చే జరిగినది.

వైకుంఠలోకానుచితప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతమ్ |
ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోఽస్త్వితి నేమతుస్తాన్ || ౧౧-౪

"జయవిజయులారా! దుష్టులైన మీరు ఈ వైకుంఠ లోకమున తగని విధముగా ప్రవర్తించినందు వలన రాక్షసులై పోవుదురు గాక!" అని శపించిరి. స్వామీ! నిన్ను సదా ఆశ్రయించుకొని యుండెడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీ హరి స్మృతి మాత్రము నశింప కుండా మమ్ము అనుగ్రహించుడు అని మహర్షులను వేడుకొనిరి.

తేదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష |
ఖగేశ్వరాంసార్పితచారుబాహురానందయంస్తానభిరామమూర్త్యా || ౧౧-౫||

కమలలోచనా! గురువాయుపుర స్వామీ! జయ విజయులు చేసిన అవినయ కర్మయు, మహర్షులు వారిని శపించిన విషయమంతయు నీకు తెలిసినది. అందువలన లక్ష్మీ దేవి వెంటరాగా గరుత్మంతునిపైన అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహము చేత సనక సనందాది మహర్షుల నందరను ఆనంద పరచుహ్చు వారున్న ప్రదేశమునకు నీవే స్వయముగా వచ్చితివి.

ప్రసాద్య గీర్భిః స్తువతో మునీంద్రాననన్యనాథావథ పార్షదౌ తౌ
సంరంభయోగేన భవైస్త్రిభిర్మాముపేతమిత్యాత్తకృపాం న్యగాదీః || ౧౧-౬

ప్రభూ! నీ దివ్య సుందర రూపమును సందర్శించిన సనక సనందాదులు ఆనందముతో నిన్ను స్తుతించు చుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోష పెట్టితివి. అట్లే నిన్ను సదా ఆశ్రయించుచున్న జయ విజయులతో "మీరు వైరా భక్తితో నన్ను సేవించుచు మూడు జన్మలెత్తిన తరువాత నా దగ్గరకు వత్తుర"ని అనుగ్రహముతో పలికితివి.

త్వదీయభృత్యావథ కాశ్యపాత్తౌ సురారివీరావుదితౌ దితౌ ద్వౌ |
సంధ్యాసముత్పాదనకష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమావివాన్యౌ || ౧౧-౭

స్వామీ! నీ భ్రుత్యులైన జయ విజయులు కశ్యప మహర్షికి, దితికి రాక్షస వీరులై జన్మించినారు. వారు రాక్షస కాలమైన సాయం సంధ్యాసమయమందు తల్లి గర్భమున పడినందు వలన దుర్మార్గులై నారు.  కవలలుగా జన్మించిన ఆ రాక్షసులు మిగుల లోక భయంకరులుగా ఉండిరి.

హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః |
ఉభౌ భవన్నాథమశేషలోకం రుషా న్యరుంధాం నిజవాసనాంధౌ || ౧౧-౮

దితికి కశ్యపమహర్షికి జన్మించిన ఆ రాక్షసులలో ఒకడు హిరణ్య కశిపుడు, ఇంకొకడు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే పూర్వ జన్మ వాసన జ్ఞానమును కోల్పోయి హీనులైరి. అందువలననే నీ ఆధీనమందున్న  సకల లోకములను వారి మిక్కిలి భయపెట్టసాగిరి.

తయోర్హిరణ్యాక్షమహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరీ |
భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచార గర్వాద్వినదన్ గదావాన్ || ౧౧-౯

ఆ రాక్షసులందు చిన్న వాడైన హిరణ్యాక్షుడు కండకావరము వలన మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధముగా తీసుకొని దేవదానవులు మొదలైన వారి నందరిని ఓడింప సాగెను. అందువల్ల తనతో యుద్ధము చేయగలిగిన వాడు ఈ ప్రపంచమున ఎక్కడ కూడా లేడను గర్వముతో నీ ప్రియురాలైన భూమిని సముద్రములో ముంచివేసి గర్జించుచు ప్రపంచమంతా తిరుగసాగెను.


తతో జలేశాత్సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయంస్త్వామ్ |
భక్తైకదృశ్యః స కృపానిధే త్వం నిరుంధి రోగాన్ మరుదాలయేశ || ౧౧-౧౦

ఈ విధముగా హిరణ్యాక్షుడు మహా గర్వముతో తిరుగుచున్నప్పుడు జలాధిపతియైన వరుణుడు అతనితో, "నీతో యుద్ధము చేయగలిగిన వాడు, నీకు సమానమైన వాడు శ్రీ హరియే" యని తెలిపెను. అందువలన హిరణ్యాక్షుడు నిను వెదక సాగినాడు. నీవు నీ భక్తులకు మాత్రము కనిపించువాడవు, అట్టి మహా మహిమ కలవాడవు, దయా సముద్రుడవగు గురువాయూరు పురాధీశా! శ్రీ శ్రీమన్నారాయణా! నీవు నా యొక్క రోగాములనన్నిటినీ దయ చేసి తొలగించుము.

పన్నెండవ దశకము - వరాహావతార వర్ణనము

స్వాయంభువో మనురథో జనసర్గశీలో
దృష్ట్వా మహీమసమయే సలిలే నిమగ్నామ్ |
స్రష్టారమాప శరణం భవదంఘ్రిసేవా-
తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే || ౧౨-౧||

ప్రభూ! స్వయంభువ మనువు సృష్టి కార్యమున నిమగ్నుడై యుండెను. అది ప్రళయ సమయము కాకున్నను భూమి నీటిలో మునిగి యుండుటను అతడు గమనించెను. వెంటనే అతడు మునీశ్వరులను అందరిని వెంట బెట్టుకొని సత్యలోకమునకు వెళ్ళెను. నిరంతరమూ నీ పాద పద్మములను సేవించు చుండెడి బ్రహ్మను అతడు శరణు వేడెను.

కష్టం ప్రజాః సృజతి మయ్యవనిర్నిమగ్నా
స్థానం సరోజభవ కల్పయ తత్ప్రజానామ్ |
ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూ-
రంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్ || ౧౨-౨||

పిమ్మట మనువు బ్రహ్మను ఇట్లు వేడుకొనెను. "పద్మ సంభవా! నేను ప్రజా సృష్టిలో నిరతుదనై యుండగా భూమి నీటిలో మునిగి పోయినది. ప్రాణులకు సంకట పరిస్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తల దాచుకొనుటకు స్థానమును కలిపించుము' అని విన్నవించిన వెంటనే ఓ కమలాక్షా! బ్రహ్మదేవుడు నీ పాద పద్మములను ధ్యానించెను.

హా హా విభో జలమహం న్యపిబం పురస్తాద్
అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి |
ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోఽస్య
నాసాపుటాత్సమభవః శిశుకోలరూపీ || ౧౨-౩||

"ప్రభూ! ప్రళయ కాల జలములను నేను మునుపే త్రాగి యుంటిని కదా! ఇప్పుడు మరల భూమి నీటిలో మునుగు చున్నదేమి? అయ్యో ఇంక నేనేమి చేయవలెను?. ఇప్పుడు నా పాదములే దిక్కు"  ఇట్లు బ్రహ్మ పలుకుచున్డగానే నీవు అతని నాసికా పుటము నుండి వరాహ శిశు రూపమున ఆవిర్భవించితివి.


అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాత్
భూయోఽథ కుంభిసదృశః సమజృంభథాస్త్వమ్ |
అభ్రే తథావిధముదీక్ష్య భవంతముచ్చైః
విస్మేరతాం విధిరగాత్సహ సూనుభిః స్వైః || ౧౨-౪||

ప్రభూ! తొలుత నీవు అంగుష్ఠ మాత్ర శరీరుడవై బయట పదిటివి. ఆయన చూచుచుండగనే ఏనుగు శరీరము వంటి శరీరముతో నీవు విజృంభించితివి. ఈ విధముగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగా నున్న నిన్ను చూసి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యెను.

కోఽసావచింత్యమహిమా కిటిరుత్థితో మే
నాసాపుటాత్కిము భవేదజితస్య మాయా |
ఇత్థం విచింతయతి ధాతరిశైలమాత్రః
సద్యో భవన్కిల జగర్జ్జిథ ఘోరఘోరమ్ || ౧౨-౫||

దేవా! బ్రహ్మ దేవుడు నీ వరాహ రూపమును చూసి ఆశ్చర్యముతో "అద్భుతమైన మహిమ గల ఈ వరాహమూర్తి నా నాసాపుటమున ఎట్లు ఉదయించెను? యితడు ఎవ్వరు? ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలును?" అని పరిపరి విధములుగా ఆలోచించు చున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంత ప్రమానమున ఎదిగి మహా భయంకరముగా గర్జించితివి.

తం తే నినాదముపకర్ణ్య జనస్తపఃస్థాః
సత్యస్థితాశ్చ మునయో నునువుర్భవంతమ్ |
తత్స్తోత్రహర్షులమనాః పరిణద్య భూయ-
స్తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వమ్ || ౧౨-౬||

జనోలోకమున, తపోలోకమున, సత్యలోకమున నివసించు చున్న మునీశ్వరులు నీ గర్జన విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతించ సాగిరి. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగా సంతోషించి ఇంకను బిగ్గరగా గర్జించి, విశాలమైన శరీరముతో సముద్రములో ప్రవేశించితివి.


ఊర్ధ్వప్రసారిపరిధూమ్రావిధూతరోమా
ప్రోత్క్షిప్తవాలధిరవాంగ్ముఖఘోరఘోణః |
తూర్ణప్రదీర్ణజలదః పరిఘూర్ణదక్ష్ణా
స్తోతౄన్మునీన్ శిశిరయన్నవతేరిథ త్వమ్ || ౧౨-౭||

స్వామీ! నీ శరీరమండున్న బూడిద రంగు గల కేశములు నిక్క బొడుచుకొని యున్నవి. వాలము పైకి లేచినది. ముఖము కిందకు ఉన్నది. నీ వేగమునకు మబ్బులన్నియు తొలగి పోసాగినవి. నీ కండ్లు చిత్ర విచిత్రముగా తిరుగ సాగినవి. అట్టి నిన్ను చూచి మహర్షులందరూ స్తుతించు చుండగా నీఎవు వారిని అనుగ్రహించుచు ఒక్క మారు జలములో దూకితివి.


అంతర్జలం తదను సంకులనక్రచక్రం
భ్రామ్యత్తిమింగిలకులం కలుషోర్మిమాలమ్ |
ఆవిశ్య భీషణరవేణ రసాతలస్థా-
నాకంపయన్వసుమతీమగవేషయస్త్వమ్ || ౧౨-౮||

స్వామీ! నీవు సముద్ర జాలములో ప్రవేశించ గానే అందున్న మొసళ్ళు తల్లడిల్లి పోయినవి. తిమింగలములు ఎటూ తోచక తిరుగ సాగినవి. సముద్రములోని నీరంతా కలుషితము కాగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రములో నీవు ప్రవేశించి గర్జించుటచే కలిగిన భయంకరమైన శబ్దమునకు రసాతలమున నున్న వారు కూడా భయపడసాగిరి. ఆ విధముగా నీవు భూమిని కనుగొనుటకు సముద్రమంతయు వెదకితివి.

దృష్ట్వాఽథ దైత్యహతకేన రసాతలాంతే
సంవేశితాం ఝటితి కూటకిటిర్విభో త్వమ్ |
ఆపాతుకానవిగణయ్య సురారిఖేటాన్
దంష్ట్రాంకురేణ వసుధామదధాః సలీలమ్ || ౧౨-౯||

పరమాత్మా! మాయా వరాహ రూపమున నీవు భూమికి వెదకుచు రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము కింద ఉంచిన విషయమును తెలిసికొంటివి. వెంటనే భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా నీ పై పడిరి. వారిని అందరిని ఏ మాత్రము లెక్క చేయక నీయొక్క కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించితివి.


అభ్యుద్ధరన్నథ ధరాం దశనాగ్రలగ్న-
ముస్తాంకురాంకిత ఇవాధికపీవరాత్మా |
ఉద్ధాతఘోరసలిలాజ్జలధేరుదంచన్
క్తీడావరాహవపురీశ్వర పాహి రోగాత్ || ౧౨-౧౦||

పరమేశ్వరా! నీవు సముద్రములోనుండి భూమిని నీ కోరపై ఎత్తి పట్టుకొన్నప్పుడు అది నీ కోరపై తగుల్కొనిన మొలక వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడా వరాహ రూపమున ఉన్న నీవు సముద్ర జలముల నుండి పైకి వచ్చితివి. అట్టి మాయా వరాహ రూపా! నీవు నా రోగాములనన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము.

పదమూడవ దశకము - హిరణ్యాక్ష వధ

హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణపరం
చరంతం సాంవర్తే పయసి నిజజంఘాపరిమితే |
భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిః
శనైరూచే నందన్ దనుజమపి నిందంస్తవ బలమ్ || ౧౩-౧||

భక్తులు కోరు వరముల నొసగు శ్రీమన్నారాయణా! హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము కలవాడవని భావించి నీతో యుద్ధముకై వెదకుచుండెను. అంతులేని ప్రళయ సముద్రము అతనికి మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చుచుండెను. అంత ఎత్తున హిరణ్యాక్షునితో నీయొక్క మహాభక్తుడైన నారద మునీంద్రుడు కపట బుద్ధితో నీ బలమును కించ పరచుచు, హిరణ్యాక్షుని పొగడుచు మెల్లగా ఇట్లు పలికెను.

స మాయావీ విష్ణుర్హరతి భవదీయం వసుమతీం
ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః |
నదన్ క్వాసౌ క్వాసావితి స మునినా దర్శితపథో
భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్ || ౧౩-౨||

"హిరణ్యాక్షా! మాయావియైన విష్ణువు నీయొక్క భూమిని హరింప దలచినాడు. ఇది చాలా అన్యాయము. ఇది తప్పుకూడా!" అని నారద మహర్షి యనెను. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడ ఎక్కడ? - అని అడుగగా నారదుడు నీవున్న ప్రదేశమును చూపించేను. అప్పుడు నీవు సముద్రములో నుండి భూమిని ఉద్ధరించు చుంటివి. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించెను.

అహో ఆరణ్యోఽయం మృగ ఇతి హసంతం బహుతరై-
ర్దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ |
మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా
పయోధావాధాయ ప్రసభముదయుంథా మృధవిధౌ || ౧౩-౩||

"ఇది అడవి మృగము కదా" అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేక మాటలతో నిన్ను నిందించు చుండెను. అతనిని నీవు ఏ మాత్రము లెక్క చేయలేదు. ఆ సమయమున నీ దంష్ట్రాగ్రమున నున్న భూదేవి భయముచే కంపించి పోవుచుండుట నీవు గమనించితివి. అట్టి భూమిని నీ మహాత్త్వము వలన సముద్రమందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధము చేయుటకు సిద్ధమైతివి.


గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నతగదో
నియుద్ధేన క్రీడన్ఘటఘటరవోద్{}ఘుష్టవియతా |
రణాలోకైత్సుక్యాన్మిలతి సురసంఘే ద్రుతమముం
నిరుంధ్యాః సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే || ౧౩-౪||

రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గద పట్టుకొని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకొని ద్వంద్వ యుద్ధమునకు పూనుకొంటివి. ఆకాశమందు మీ ఇద్దరి గడలు ఒకదానికొకటి తగులుత వలన ఘట ఘట శబ్దము వ్యాపించినది. మీ ఇద్దరి యుద్ధము చూడవలెనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబదిరి. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో 'పరమాత్మా! ఈ రాక్షసాధముని సంధ్యాకాలము ముందే వధించుము' అని సూచన చేసి యుండెను.

గదోన్మర్దే తస్మింస్తవ ఖలు గదాయాం దితిభువో
గదాఘాతాద్భూమౌ ఝటితి పతితాయామహహ ! భోః ! |
మృదుస్మేరాస్యస్త్వం దనుజకులనిర్మూలనచణం
మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే || ౧౩-౫||

ప్రభూ! గదా యుద్ధమున మీ గద రాక్షసుడైన హిరణ్యాక్షుని గదా ఘాతమునకు భూమిపై పడిపోయినదట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము? నీవు కూడా ముఖమందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసులందరినీ సంహరించుట యందు ఖ్యాతి నొందిన నీ చక్రమును మనస్సులో స్మరించుకొంటివి. అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరెను. అంతట నీవు అద్భుతముగా విరాజిల్లితివి.


తతః శూలం కాలప్రతిమరుషి దైత్యే విసృజతి
త్వయి ఛిందత్యేనత్ కరకలితచక్రప్రహరణాత్ |
సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదంస్త్వాం సమతనోత్
గళన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః || ౧౩-౬||

మృత్యువు వలె మహా భయంకరుడు అయిన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసరివేసెను. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలయ్యెను. అందువల్ల హిరణ్యాక్షుడు అమితమైన కోపముతో నీపై ముష్టిప్రహరమును గావించెను. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమియు చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్తు నంతయు మోహమున ముంచు మాయలను నీ పై ప్రయోగించెను.

భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుతే
తతో మాయాచక్రే వితతఘనరోషాంధమనసమ్ |
గరిష్ఠాభిర్ముష్టిప్రహృతిభిరభిఘ్నంతమసురం
స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధీః || ౧౩-౭||

హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్ర కాంతి అవలీలగా నాశనము చేసినది. అందువలన ఆ రాక్షసునకు కోపము అధిక మయ్యెను. అతడు కోపమును పట్టజాలక నీపై ఘనమైన ముష్టి ఘాతములకు దిగెను. అప్పుడు నీవు నీ పాదాంగుష్ఠముచేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక దెబ్బ కొట్టితివి.

మహాకాయఃస్సోఽయం తవ కరసరోజప్రమథితో
గళద్రక్తో వక్త్రాదపతదృషిభిః శ్లాఘితహతిః |
తదా త్వాముద్దామప్రమదభరవిద్యోతిహృదయా
మునీంద్రాస్సాంద్రాభిః స్తుతిభిరనువన్నధ్వరతనుమ్ || ౧౩-౮||

దేవా! మహా కాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రహారముల ధాటికి నోటినుండి రక్తము గ్రక్కుచు అసువులను వీడి పడిపోయెను. అతనిని నీవు అట్లు దెబ్బ తీసినందులకు  అప్పుడు రుషులందరును  నిన్ను పొగడ సాగిరి. వారి హృదయములలో ఆనందము పొంగి పొరలెను. అంతట వారు భక్తితో స్తోత్రములను చేయుచు యజ్ఞ స్వరూపుడవైన నిన్ను స్తుతించ సాగిరి.


త్వచి చ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం
చతుర్హోతారోఽంఘ్రౌ స్రుగపి వదనే చోదర ఇడా |
గ్రహా జిహ్వాయాం తే పరపురుష కర్ణే చ చమసా
విభో సోమో వీర్యం వరద గళదేశేఽప్యుపసదః || ౧౩-౯||

పరమ పురుషా! నీ శరీర చర్మమే గాయత్రీ మొదలగు ఛందస్సులు, నీ రోమములే దర్భలు, నీ నేత్రములే ఘ్రుతము. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ అని ఈ నలుగురును నీ నాలుగు పాదములు. నీ ముఖమే స్రుక్కు, ఉదరమే 'ఇడ', నీ నాలుకయే గ్రహము, కర్ణములే చమసములు, వీర్యమే సోమరసము, నీ గలమే ఉపసదము అను ఇట్టి విశేషము. కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞ స్వరూపుడవు.


మునీంద్రైరిత్యాదిస్తవనముఖరైర్మోదితమనా
మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్ |
స్వధిష్ణ్యం సంప్రాప్తః సుఖరసవిహారీ మధురిపో
నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే || ౧౩-౧౦||

గురువాయూర్ పురాధిపా! శ్రీ కృష్ణా! ఈ విధముగా మునీంద్రులు అందరును చేసిన అనేక విధములగు స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి. విశాలము, ఉన్నతమైన శరీరముతో, నిర్మలమైన కీర్తితో ప్రకాశించుచు నీవు నీలోకమైన వైకుంఠమునకు చేరి ఆనందమున ఎప్పటివలె విహరించు చుంటివి. మధుసూదనా! నా సమస్త రోగములను కృపతో  తొలగించుము.

పదునాలుగవ దశకము - కపిలోపాఖ్యానము 

సమనుస్మృతతావకాంఘ్రియుగ్మః స మనుః పంకజసంభవాంగజన్మా |
నిజమంతరమంతరాయహీనం చరితం తే కథయన్సుఖం నినాయ || ౧౪-౧

ప్రభూ! బ్రహ్మ దేవుని శరీరము నుండి జన్మించిన మనువు ప్రతిదినము నీ పాద పద్మములను ధ్యానించుచు నీ దివ్య గాథలను  కీర్తించు చుండెను. అందువలన అతడు నిరాటంకముగా నీ గాథలను గానము చేయుచు తన మంవంతరమును సుఖముగా గడపెను.

సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో ద్రుహిణచ్ఛాయభవస్తదీయవాచా |
ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమాః సిషేవే || ౧౪-౨

భగవాన్! ఆ సమయమందు బ్రహ్మదేవుని శరీర చాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రియైన బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివ్రుద్ది చేయుటకు పూనుకోనేను. అందువలన సుందరుడవైన నీ పాద పద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఆచరించెను.


గరుడోపరి కాళమేఘకమ్రం విలసత్కేలిసరోజపాణిపద్మమ్ |
హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ || ౧౪-౩

ప్రభూ! అనన్య భావముతో నీ పాద పద్మములను స్మరించుచు తపస్సు చేయుచున్న ఆ కర్దమ ప్రజాపతిని అనుగ్రహించ దలచి నీవు ప్రత్యక్షమైతివి. గరుత్మంతునిపై యున్న నీ ఆకారము నీల మేఘమువలె అందముగా ఉండెను. విలాసమునకై నీవు పట్టుకున్న తామర పువ్వు నీ కరపద్మమున విరాజిల్లు చుండెను. నీ ముఖమందు చిరునవ్వు కనిపించు చుండెను. అట్టి నీ దివ్య సుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి నీవు దర్శన మొసగితివి.

స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః |
కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతోఽభూః || ౧౪-౪

దేవా! కర్దమ ప్రజాపతికి నీ దర్శనమై నంతనే అతడు ఆనంద పరవశు డయ్యెను.  ఆయన శరీరము పులకించేను. అనంతరము ఆయన చేసిన స్తోత్రములకు మిక్కిలి సంతోషించి నీవు ఆయనకు ఇట్లు వరములు ఒసగితివి. "కర్దమ ప్రజాపతీ! మనువు పుత్రిక యగు దేవహూతి  నీకు భార్య యగును. మీకు తొమ్మిది మంది పుత్రికలు కలుగుదురు. నేనే స్వయముగా కపిలుడు అను పేరుతో మీకు పుత్రునిగా అవతరింతును. నీవు తనువు చాలించిన పిమ్మట వైకుంఠమునకు చేరుకొందువు" - అని వరములను ప్రసాదించిన పిమ్మట నీవు అంతర్ధానమైతివి.

స మనుశ్శతరూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా |
భవదీరితనారదోపదిష్టస్సమగాత్కర్దమమాగతిప్రతీక్షమ్ || ౧౪-౫||

స్వామీ నీవు మనువుతో అతని పుత్రికయైన దేవహూతిని కర్దమ ప్రజాపతికిమ్మని చెప్పునట్లు నారదుని ప్రేరేపించితివి. అతడు మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపెను. అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూపను, దేవ హూతిని వెంట బెట్టుకొని కర్దమ ముని ఆశ్రమమునకు పోయెను. అప్పుడా కర్దమ మహాముని కూడా నారాయణుని వరము అనుసరించి మనువు యొక్క ఆగమనమునకై ఎదురు చూచు చుండెను.

మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోఽసౌ |
భవదర్చననిర్వృతోఽపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదమ్ || ౧౪-౬

ప్రభూ! మనువు దేవహూతిని తనకిచ్చి వివాహము చేసినందు వలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించెను. నీ అర్చన యందు నిరతుడై యున్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వలన ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యెను.

సపునస్త్వదుపాసనప్రభావాద్దయితాకామకృతే కృతే విమానే |
వనితాకులసంకులో నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా || ౧౪-౭||

కర్దమ ప్రజాపతి నీ ఉపాసనా బలము వలన తన భార్య యైన దేవహూతి కోర్కె తీర్చుటకు ఒక విమానమును నిర్మించు కొనెను. అందు పరిచారికలు కోలుస్తుండగా దేవహూతితో కలసి నూతన సుందర రూపమును ధరించి ఆకాశ మార్గమున విహరించ సాగెను.

శతవర్షమథ వ్యతీత్య సోఽయం నవ కన్యాః సమవాప్య ధన్యరూపాః |
వనయానసముద్యతోఽపి కాంతాహితకృత్త్వజ్జననోత్సుకో న్యవాత్సీత్ || ౧౪-౮

ఈ విధముగా కర్దమ ప్రజాపతి వంద సంవత్సరములు సుఖముగా గడిపెను. అతనికి మిక్కిలి సుందరులైన తొమ్మిది మంది కుమార్తెలు కలిగిరి. వానప్రస్థ ఆశ్రమము స్వీకరించ వలెనని అనుకున్నప్పటికీ దేవహూతికి సంతోషము కలిగించుటకై పరమాత్మ వాగు నీ అవతారమునకై ఎదురుచూస్తూ కాలము గడిపెను.


నిజభర్తృగిరా భవన్నిషేవా నిరతాయామథ దేవ దేవహూత్యామ్ |
కపిలస్త్వమజాయథా జనానాం ప్రథయిష్యన్పరమాత్మతత్త్వవిద్యామ్ || ౧౪-౯

దేవా! దేవహూతి తన భర్త యగు కర్దముడు చెప్పినట్లు పరమాత్మవగు నిన్ను సేవించు చుండెను. కొంత కాలమునకు కపిలుడను పేరుతో నీవు దేవహూతికి జన్మించి పరమాత్మ తత్త్వ విద్యను లోకమున ప్రచార మొనర్చితివి.


వనమేయుషి కర్దమే ప్రసన్నే మతసర్వస్వముపాదిశంజనన్యై |
కపిలాత్మక వాయుమదిరేశత్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్ || ౧౪-౧౦

కపిలుడను పేరుతో ప్రసిద్ధి చెందిన గురువాయురప్ప! నీ తండ్రి యైన కర్దమ ప్రజాపతి వానప్రస్థ ఆశ్రమము స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లియైన దేవహూతికి సాంఖ్య యోగమును ఉపదేశించితివి. అట్టి స్వామీ! కరుణతో నా రోగాములన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము.

పదునైదవ దశకము - కపిలోపదేశము

 మతిరిహ గుణసక్తా బంధకృత్తేష్వసక్తా
త్వమృతకృదుపరుంధే భక్తియోగస్తు సక్తిమ్ |
మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౧||

"మనస్సు విషయములందు ఆసక్తమైనచో అది సంసార బంధములకు కారణ మగుచున్నది. అట్లే, ఆ మనసు విశ్యాసక్తిని పెట్టుకోననిచో మోక్షము కలుగును. సంసార బంధన కారణమైన విశ్యాసక్తిని భక్తియోగము సులభముగా పోగొట్టును. అట్టి భక్తి యోగము సత్సంగము వలననే లభించును. కావున భక్తి మార్గామునే అవలంబించవలెను. " - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ప్రకృతిమహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతా-
న్యపిహృదపి దశాక్షీ పూరుషః పంచవింశః |
ఇతి విదితవిభాగో ముచ్యతేఽసౌ ప్రకృత్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౨||

"మూల ప్రకృతి, మహాత్తత్త్వము, అహంకారము, ఐదు తన్మాత్రలు, పృథివి మొదలైన పంచభూతములు, మనస్సు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఆత్మ స్వరూపుడైన పురుషుడు అని పంచవింశతి తత్త్వములను చక్కగా తెలిసికొన్నచో త్రిగుణాత్మకమైన ప్రకృతి బంధము తొలగును. " - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ప్రకృతిగతగుణౌఘైర్నాజ్యతే పూరుషోఽయం
యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ |
మదనుభజనతత్త్వాలోచనైః సాప్యపేయాత్
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౩||

"ఈ పురుషుడు వాస్తవముగా ప్రకృతికి అతీతుడు. కనుక అతడు దానికి సంబంధించిన త్రిగుణములకు  అధీనుడై యుండడు. కాని అతడు ప్రకృతి యందు ఆసక్తుడైనచో ఆ త్రిగుణములు అతనిని బంధించును. అట్టి ప్రకృతి బంధమునకు దూరము కావలెనన్నచో నిన్ను సేవించుచు నీ తత్త్వ చింతనను ఎల్లప్పుడూ చేయవలెను" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.


విమలమతిరుపాత్తైరాసనాద్యైర్మదంగం
గరుడసమధిరూఢం దివ్యభూషాయుధాంకమ్ |
రుచితులితతమాలం శీలయేతానువేలం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౪||

"సాధకుడు యమ నియమముల ద్వార బాహ్యాభ్యంతర శుచిని పొందవలెను. ఆసనాది యోగ క్రియలను అనుష్ఠించవలెను. అంతట తమాల శ్యామల వర్ణ శోభితుడవు, దివ్య ఆభరణ, ఆయుధ ధారుడవు, గర్త్మంతుని పై అధిష్ఠించిన వాడవు ఐన నీ యొక్క దివ్య రూపమును ఆ సాధకుడు నిరంతరము ధ్యానించ వలెను" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

మమ గుణగుణలీలాకర్ణనైః కీర్తినాద్యైః
మయి సురసరిదోఘప్రఖ్యచిత్తానువృత్తిః |
భవతి పరమభక్తిః సా హి మృత్యోర్విజేత్రీ
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౫||

"పరమాత్మనగు  నా యొక్క కళ్యాణ గుణములను దివ్య లీలలను వినుచు కీర్తించుచు, అనుభవించు చుండవలెను. అప్పుడు పరమ భక్తి లభించును. ఆ పరమ భక్తి మృత్యువును సైతము జయించును" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

అహ హ బహులహింసాసంచితార్థైః కుటుంబం
ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాళీ |
విశతి హి గృహసక్తో యాతనాం మయ్యభక్తః
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౬||

"మానవుడు తన కుటుంబమును పోషించు కొనుటకై పెక్కుమందిని బాధించుచు ధనమును సంపాదిన్చును. స్త్రీలకు వశుడై తన సంతానమును లాలించుచు గృహ కర్మలందు ఆసక్తుడగు చుండును. నా యందు భక్తి లేని అట్టి గృహస్థుడు అనేక బాధలను అనుభవించు చుండును ఇది యెంత శోచనీయము" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

యువతిజఠరఖిన్నో జాతబోధోఽప్యకాండే
ప్రసవగలితబోధః పీడయోల్లంంఘ్య బాల్యమ్ |
పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౭||

"జీవుడు స్త్రీ గర్భమున ప్రవేశించినప్పటి నుండి దుఃఖములను అనుభవించుచు, తాను పుట్టుటకు ముందు పరమాత్మ కరుణ వలన జ్ఞానము కలిగినను భూమి మీద పడగానే ఆ జ్ఞానము అంతరించును. అతని బాల్యమంతయు అనేక బాధలతో గడచి పోవును. అట్లే, యౌవనమున మోహము వలన సమస్త జ్ఞానము కోల్పోవును." అని కపిలుని రూపమున నీవు దేవహూతికి బోధించితివి.

పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః
స చ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామీ |
మయి నిహితమకామం కర్మ తూదక్పథార్థే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౮||

"పితృ దేవతలను, ఇతర దేవతలను నియమ నిష్ఠలచే పూజించుచు ధార్మిక జీవనము గడుపు గృహస్థుడు దక్షిణాయన మార్గమున స్వర్గాది ఊర్ధ్వ లోకములకు పోయి కర్మ భోగములను అనుభవించి తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. కానీ నీ యందు భక్తి కలిగి, ఎట్టి కోరికలు లేక కర్మలను ఆచరించు వాడు ఉత్తరాయణ మార్గమున పోయి మోక్షమును పొందును" అని కపిలుని రూపమున ఉన్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ఇతి సువిదితవేద్యాం దేవ హే దేవహూతిం
కృతనుతిమనుగృహ్య త్వం గతో యోగిసంఘైః |
విమలమతిరథాఽసౌ భక్తియోగేన ముక్తా
త్వమపి జనహితీర్థం వర్తసే ప్రాగుదీచ్యామ్ || ౧౫-౯||

ఈ విధముగా నువ్వు తల్లియైన దేవహూతికి సాంఖ్య యోగము బోధించి నందువలన ఆమె జ్ఞానవంతురాలై నిన్ను అనేక విధముల స్తుతించినది. అప్పుడు నీవు ఆమెను అనుగ్రహించి యోగి సంఘములు సేవించు చుండగా వారితో కూడి వెళ్లి పోయితివి. దేవహూతి నీ యెడ కల నిశ్చలమైన భక్తి యోగాముతో ముక్తిని పొందెను. నీవు కూడా లోక కళ్యాణము కొరకు ఈశాన్య దిక్కుకు పోయి అచ్చట నివసించితివి.

పరమ కిము బహూక్త్యా త్వత్పదాంభోజభక్తిం
సకలభయవినేత్రీం సర్వకామోపనేత్రీమ్ |
వదసి ఖలు దృఢం త్వం త్వద్విధూయామయాన్మే
గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వ భక్తిమ్ || ౧౫-౧౦||

పరమాత్మా! గురువాయురప్పా! ఇన్ని మాటలేల? నీ పాదపద్మము లందలి భక్తి సమస్త భయములను తొలగించుననియు, అన్ని విధములైన కోరికలను తీర్చుననియు స్పష్టముగా బోధించితివి. ఈ విధముగా మనవ కళ్యాణమునకై జ్ఞాన బోధ చేసిన నీవు నీయందు దృఢమైన భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహింపుము. అట్లే నాయొక్క సమస్త రోగములను దయతో తొలగించుము.